దేశంలో మళ్లీ కోవిడ్ భయాందోళనలు మళ్లీ వ్యక్తమవుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్టివ్ (Active) కేసులు 3,758కి చేరాయి. ఈ సంఖ్య గత వారం రోజుల కంటే ఎక్కువగా ఉండటం ప్రభుత్వ అధికారులను, ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పందన
కొవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతున్నదన్న విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలకంగా స్పందించింది. ఇటీవల ఎక్కువగా పుట్టుకొస్తున్న వేరియంట్లలో LF.7, NB.1.8.1 అనే సబ్ వేరియంట్లను “పర్యవేక్షణలో ఉన్న వేరియంట్లు”గా WHO ప్రకటించింది. ముఖ్యంగా NB.1.8.1 వేరియంట్ పలు దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. అయితే ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రుల్లో చేరికలు, కేసుల పెరుగుదల కనిపిస్తున్నా, ప్రస్తుతానికి అది తీవ్రమైన అనారోగ్య పరిణామాలకు దారితీస్తుందన్న ఆధారాలు లేవని స్పష్టంచేసింది.
రోజురోజుకూ కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి చేరింది. ఈ పరిణామం ప్రజల్లో మళ్లీ కొవిడ్ భయాలను రేకెత్తిస్తోంది. కొవిడ్ మళ్లీ వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పందించింది. పలు దేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఎన్బీ.1.8.1 వేరియంట్తో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ఆస్పత్రుల్లో చేరికలు ఒకేసారి పెరుగుతున్నా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు ఏమీ లేవని తెలిపింది.
ప్రస్తుత వ్యాక్సిన్లు సమర్థవంతమే: WHO
ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. NB.1.8.1 వేరియంట్కు వ్యతిరేకంగా ఇవి రోగ నిరోధక శక్తిని అందిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
వైద్యుల సూచనలు – హెచ్చరికలతో జాగ్రత్తలు
మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. ప్రయాణాల్లోనూ, జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పని సరిగా మాస్కులు వాడాలని సూచించారు. కొవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చినవారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
Read also: Amit Shah : మమతా బెనర్జీపై అమిత్షా ఫైర్