కోయంబత్తూరు (Coimbatore) జిల్లా వాల్పరై వద్ద చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన అందరి హృదయాలను కలిచివేస్తోంది. అడవిని ఆనుకుని ఉన్న టీ ఎస్టేట్ ప్రాంతాల్లో చిరుతపులుల బెడద ఉన్నప్పటికీ, ఇలా నడిరోడ్డుపై మనుషుల మధ్యకు వచ్చి ఓ నాలుగేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన ఘటన స్థానికులను మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేసింది. నాలుగు సంవత్సరాల పసి ప్రాయపు బాలిక రోష్నిని చిరుత తమ నోటితో పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లిందన్న విషయం ఊహించడానికే భయంకరంగా ఉంది.

తల్లిదండ్రుల ఆవేదన:
తల్లిదండ్రులు టీ ఎస్టేట్లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత పాపం ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని అడవుల్లోకి లాక్కెళ్లింది. ఈ ఘటన వాల్పరైలో శుక్రవారం సాయంత్రం జరిగింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్లోని సౌత్ డివిజన్లో చోటు చేసుకుంది. చిన్నారి రోష్ని, జార్ఖండ్కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె.
అటవీ అధికారులు, పోలీసుల గాలింపు:
పాపం బాలికకు ఏదైనా ఆనవాలు దొరికేలా గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు, పోలీసులంతా కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also: Tanu: గొయ్యి తవ్వి కోడలిని పూడ్చి పెట్టి.. ఆపై లేచిపోయిందని ప్రచారం..
Air India: ప్రమాదం తర్వాత భారీగా ఎయిర్ ఇండియాకు తగ్గిన బుకింగ్లు