సరిహద్దుల్లో ఉన్న పాకిస్థాన్, చైనా (Pakistan & China) దేశాలు గతకొంత కాలంగా భారత్ను కవ్వించడమే పనిగా పెట్టుకున్నాయి. పాకిస్థాన్ తరచూ ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ, కశ్మీర్(Kashmir ) ప్రాంతంలో అశాంతిని రెచ్చగొడుతోంది. అటు చైనా మాత్రం అటు లడఖ్, ఇటు అరుణాచల్ ప్రదేశ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆక్రమణ యత్నాలు చేస్తూ, దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది కేవలం భౌగోళిక విస్తరణ కోసమే కాదు, ఆంతార్జాతీయంగా భారత్ను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో కూడిన చర్యలుగా చూస్తున్నారు విశ్లేషకులు.
చైనా, టిబెట్ భాషల్లో పేర్లు
ఇటీవలి ఘటనలో చైనా, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా, టిబెట్ భాషల్లో పేర్లు పెట్టింది. ఇదంతా ఆ ప్రాంతం మీద తమ హక్కు చూపించడానికి చేసిందని విశ్లేషణ. ఇది చైనాకు మామూలు ప్రవర్తన అయిపోతోంది. గతంలో కూడా ఇలా చోటు పేర్లు మార్చడం ద్వారా తమ పెత్తనం చాటుకునే ప్రయత్నం చేసింది. కానీ ఇది అంతర్జాతీయంగా అమోదించబడని, వ్యర్థమైన చర్య. చైనా ఈ విధంగా వాస్తవాలను మార్చలేనని ప్రపంచ దేశాలు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ భారత్లో ఓ విడదీయలేని భాగం
భారత ప్రభుత్వం చైనాకు ధైర్యంగా సమాధానం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో ఓ విడదీయలేని భాగమని, చైనా చేసే అబద్ధపు ప్రచారాలు వాస్తవాలను మార్చలేవని తేల్చి చెప్పింది. పేర్లు మార్చినా, చుట్టూ గోడలు కట్టినా లేదా మ్యాపులు మార్చినా – చరిత్ర, చట్టం, ప్రజల నమ్మకం ఏవీ చైనాకు అనుకూలంగా మారబోవు. చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు తమ మానసిక ధోరణి మార్చుకోకపోతే, భవిష్యత్తులో మరింత ఒంటరిగా మిగిలిపోవడం ఖాయం. భారత్ మాత్రం శాంతియుతంగా, కానీ ధైర్యంగా ముందుకు సాగుతోంది.
Read Also : Permission : సులభతరంగా అనుమతుల ప్రక్రియ – సీఎం రేవంత్