हिन्दी | Epaper

News Telugu: Chhattisgarh: 100మందిపైగా మావోయిస్టుల లొంగుబాటు

Rajitha
News Telugu: Chhattisgarh: 100మందిపైగా మావోయిస్టుల లొంగుబాటు

పోలీసులకు లొంగిపోయిన వారిలో సీనియర్ నేత మల్లోజుల ఉన్నట్లు సమాచారం. చర్ల : దాదాపు నాలుగుదశాబ్దాల పాటు చత్తీస్గఢ్ Chhattisgarh దండకారణ్యంలో సమాంతర పాలన చేసిన మావోయిస్టు పార్టీ నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఉద్యమానికి ఊతం ఇచ్చిన ప్రాంతంలో నేడు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. గడిచిన ఏడాదిన్న కాలంలో మునుపెన్నడూ చవిచూడవి ఎన్ కౌంటర్లు లొంగుబాట్లు ఆపార్టీ కకావికలం చేస్తుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు Maoists రహిత సమాజాన్ని చూస్తారని ప్రకటించారు. అందుకు అణుగుణంగానే నేటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులను ఐదుగురు పొగొట్టుకున్న పార్టీకి మరో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు సుజాత మల్లోజుల వేణుగోపాలరావు పొలీసుల ఎదుట లొంగిపొయారు. Chhattisgarh దట్టమైన దండకారణ్యంలో వర్షాకాలంలో సైతం విశృత కూబింగ్ చేపడు తున్న భద్రతా బలగాల గాలింపు చర్యలను ఎదుర్కొవడం మావోయిస్టులకు పెను సవాల్ గా మారింది. భద్రాతా బలగాల దాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉద్యమాన్ని ముందుకు సాగిస్తున్నారు కొందరు.

Qr Code: నేషనల్ హైవేలకు క్యూఆర్ కోడ్లు

Chhattisgarh

Chhattisgarh

80 మంది

మరికొందరు పార్టీలో ఉండి ప్రాణాలు పొగొట్టుకోవడం కన్నా లొంగిపొయి ప్రజాజీవనంలో కలవడమే మంచిది అన్న అలోచనతో లొంగుబాట్లకు శ్రీకారం చుట్టారు. నెలరోజుల క్రితం బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎదుట 80 మంది మావోయిస్టులు లొంగిపొగా తాజాగా గురువారం 103 మంది మావోయిస్టులు లొంగిపొవడం సంచలనం కలిగించింది. లొంగిపొయిన వారిలో ఇరవై మంది మహిళలు ఉన్నారు. మరో 49 మంది పై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపొయిన మావోయిస్టులకు తక్షన పరిహరం ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల నగదును అందజేసారు. మావోయిస్టు ఉద్యమంలో ఉండి సాందించేది ఏమి లేదని చత్తీస్గఢ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలువినియోగించు కోవాలని జనజీవన స్రవంతిలో కలిసిపొయి ప్రశాంత జీవనం గడపాలని ప్రభుత్వం లోన్ వర్కట్ (ఇంటికి రండి) కార్యక్రమానికి ఆకర్షితులై లొంగిపొతున్నారని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.

చర్లలో మావోయిస్టుల లొంగుబాటు ఎందుకు సంచలనం కలిగించింది?
ఒకే రోజు 103 మంది మావోయిస్టులు, అందులో 20 మంది మహిళలు కూడా, పోలీసులకు లొంగిపోవడం వల్ల ఇది పెద్ద సంఘటనగా మారింది.

లొంగిపోయిన వారిలో ఎవరెవరూ ఉన్నారు?
సీనియర్ నేత మల్లోజుల వేణుగోపాలరావు సహా పలువురు ముఖ్య నాయకులు లొంగిపోయినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870