Central Govt: దేశంలో రూ.10, రూ.20, రూ.50 వంటి తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ నోట్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.
Read Also: Mangalagiri: రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

కోట్లలో సరఫరా అయిన నోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నివేదికను ఉటంకిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు రూ. 10 నోట్లు: 439.40 కోట్లు రూ. 20 నోట్లు: 193.70 కోట్లు రూ. 50 నోట్లు: 130.30 కోట్లు నోట్లను సరఫరా చేసినట్లు మంత్రి తెలిపారు. సాధారణంగా ఏటీఎంల ద్వారా చిన్న డినామినేషన్ నోట్లను పంపిణీ చేయరని, అయితే వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు ‘స్మాల్ వాల్యూ డిస్పెన్సర్ల’ ద్వారా పంపిణీ చేసే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సభకు తెలియజేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐ ఎప్పటికప్పుడు వివిధ నోట్ల అవసరాన్ని అంచనా వేస్తుందని పంకజ్ చౌధరి వివరించారు. నోట్లు, నాణేలతో పాటు డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా తక్కువ విలువ లావాదేవీల అవసరాలు తీరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రూపే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 2025 డిసెంబర్ 31 నాటికి సుమారు 3.72 లక్షల లావాదేవీల ద్వారా రూ.111.17 కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు మంత్రి వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: