हिन्दी | Epaper

రైతులకు కేంద్రం శుభవార్త

Vanipushpa
రైతులకు కేంద్రం శుభవార్త

పంటలకు మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోగునార పంటకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.305 మేర పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్‌‌ నిర్ణయం తీసుకుంది. దీంతో 2025-26 సీజన్‌లో ముడి జనపనార (టీడీ-3) క్వింటాలకు ధరను రూ.5,650గా నిర్ణయించారు. ఇది సాగు ఖర్చుకంటే దాదాపు 67 శాతం అధికమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను మీడియా వెల్లడించిన మంత్రి.. 2014-15లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టే నాటికి జనపనార క్వింటాలు ధర రూ.2,400 ఉండేదని చెప్పారు. ప్రస్తుత ధర దాని కంటే 2.35 రెట్లు అధికమని ఆయన తెలిపారు.

సాగు వ్యయంపై అన్నదాతలకు సగటున 66.8 శాతం మేర ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
జనపనార పంటకు 2003-04- నుంచి 2013-14 మధ్య కాలంలో కనీస మద్దతు ధర కింద రూ.400 కోట్లు చెల్లిస్తే.. మోదీ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో రూ.1,300 కోట్ల అందజేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా జనపనార పరిశ్రమపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా మొత్తం 40 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. గతేడాది 1.70 లక్షల మంది రైతుల నుంచి గోగునార కొనుగోలు చేశారు. ఒక్క పశ్చిమ్ బెంగాల్‌లోనే 82 శాతం మంది ఉండగా.. అసోం, బిహార్‌లో 9 శాతం మంది ఉన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని క్యాబినెట్‌ తీర్మానించినట్టు పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మిషన్ వల్ల దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగిందని ఆయన అన్నారు. ఆరోగ్య రంగంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతిని మంత్రివర్గం సమీక్షించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870