हिन्दी | Epaper

Bus Accident: బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపై దూసుకెళ్లిన బస్సు..ఎక్కడంటే?

Sharanya
Bus Accident: బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపై దూసుకెళ్లిన బస్సు..ఎక్కడంటే?

Kerala: కేరళ (Kerala) లోని త్రిసూర్ జిల్లా చోవూర్ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం ఒక దారుణ ఘటన జరిగింది. వర్షం పడుతుండగా బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి ఒక్కసారిగా ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే

త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులతో నిల్చున్నారు. ఇంతలో ఓ బస్సు అటుగా వస్తూ అదుపుతప్పింది. బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. మహిళలు ప్రమాదాన్ని గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సీసీటీవీ ఫుటేజ్ వైరల్:

ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను కలచివేస్తున్నాయి.

డ్రైవర్ పరారీలో:

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఘటన అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్తిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

Tiger: సియోని జిల్లాలో ఇద్దరిని బలిగొన్న పులి ఎట్టకేలకు పట్టివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870