ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. ఇటీవల రూ.2626 యాన్యువల్ ప్లాన్ను ప్రవేశపెట్టిన సంస్థ, ఇప్పుడు ఎక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం రూ.2799 ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రోజుకు 3 జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also: Tax: మీల్స్ పన్ను మినహాయింపు పెంపు ప్రతిపాదన

ఇక దేశ్ కా నెట్వర్క్, దేశ్ కా భరోసా’ అంటూ ప్రచారం చేస్తున్న ఈ ప్లాన్ కోసం వినియోగదారులు రూ.2626తో రీఛార్జ్ చేసుకోవాలి. (BSNL) 365 రోజుల వరకు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2.6 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అపరిమిత కాల్స్ యధావిధిగా లభిస్తాయి. అయితే, ఈ ప్రత్యేక ఆఫర్ ఫిబ్రవరి 24 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: