हिन्दी | Epaper

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

Sukanya
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి వస్తే గిగ్ వర్కర్లకు 10 లక్షల రూపాయలు జీవిత బీమా, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, గుజరాత్‌లోని సబర్మతీ రివర్ ఫ్రంట్ తరహాలో యమునా నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోను విడుదల చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. విలేకరులతో అమిత్ షా మాట్లాడుతూ, 50,000 ఉద్యోగాలు, ఢిల్లీ ప్రజలకు 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు, ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాల భాగస్వామ్యంతో మహాభారత్ కారిడార్ కల్పనకు బిజెపి హామీ ఇస్తుందని చెప్పారు.

ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీల్లో కొనుగోలు, అమ్మకం, నిర్మాణంతో సహా పూర్తి యాజమాన్య హక్కులను బీజేపీ ఇస్తుందని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు బీజేపీ ఉచిత చికిత్స అందజేస్తుందని, అధికారంలోకి వోచిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదం తెలుపుతామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆప్ హయాంలో సీల్ చేసిన 13,000 షాపులను తెరిచేందుకు కూడా కృషి చేస్తామని, 13,000 బస్సులను ఈ-బస్సులుగా మారుస్తామని ఆయన చెప్పారు.

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

మూడేళ్ళలో యమునా నదిని శుద్ధి చేసి అరవింద్ కేజ్రీవాల్ మరియు అతని కుటుంబాన్ని స్నానానికి ఆహ్వానిస్తాను అని ఆయన అన్నారు. ఢిల్లీలో పేదల సంక్షేమ పథకాలు ఏవీ నిలిపివేయబడవని, బీజేపీ హామీలను నెరవేరుస్తుందని నేను పునరుద్ఘాటిస్తున్నానని అమిత్ షా అన్నారు. జనవరి 17న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విడుదల చేసిన మేనిఫెస్టో మొదటి భాగంలో మహిళా సమృద్ధి యోజన కింద రూ.2,500 , గర్భిణులకు రూ.21,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ హామీ ఇచ్చింది . అధికారంలోకి వస్తే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.500 సబ్సిడీ, హోలీ, దీపావళి సందర్భంగా మహిళలకు ఒక్కో సిలిండర్‌ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కెజి మరియు పిజి విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తుందని, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870