हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు

Sharanya
BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు

బీజేపీ దేశ వ్యాప్తంగా తన గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సున్నితంగా, కానీ స్పష్టంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఆరెస్సెస్ సమన్వయం

బీజేపీలో కీలక నిర్ణయాల వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పాత్ర కీలకంగా మారింది. కొత్త రాష్ట్రాధ్యక్షుల ఎంపికలో పార్టీ కేవలం సామాజిక సమీకరణాలే కాక, ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న, పార్టీ పట్ల విధేయత చూపిన నాయకులను ప్రాధాన్యతనిస్తుంది. జాతీయ స్థాయిలో అధ్యక్షుని ఎంపిక విషయంలో కూడా ఆరెస్సెస్‌తో సంప్రదింపులు జరిగి ఒక అభిప్రాయం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఆరెస్సెస్ ముద్ర ఈ నెల 20వ తేదీ తరువాత ఎప్పుడైనా పార్టీ చీఫ్ తో పాటుగా రాష్ట్రాల అధ్యక్షుల పైన అధికారికం గా ప్రకటన చేయనున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది.

జాతీయ అధ్యక్షుని ఎంపిక – మోదీ మార్క్ దృష్టాంతం

నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక మోదీ స్టైల్‌లో జరుగనుంది. గతంలో ఊహించని నాయకులను కీలక స్థానాల్లోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. ఈసారి కూడా పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న, రాజకీయ వ్యూహాల్లో దిట్ట అయిన ఒక నేతను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ఎంపిక తర్వాత పార్టీ నిర్మాణంలో, బాధ్యతల మార్పుల్లో కీలకమైన మార్పులు వచ్చే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ, బీజేపీ వ్యూహపరంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణలో బీసీ వర్గానికి చెందిన నేతను బీజేపీ అధ్యక్షునిగా తీసుకురావాలని భావిస్తోంది. బీసీ కార్డు తో పాటు ఆరెస్సెస్ నేపథ్యం ఉండేలా చూసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, యువతలో ఆకర్షణ పొందే నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇస్తూ ఆరెస్సెస్ నేపథ్యం కలిగిన నేతను రాష్ట్ర అధ్యక్షునిగా తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. గతంలో పార్టీ కోసం సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేసిన నేతలకు మోదీ, అమిత్ షా జంట ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకంతో బీజేపీ ఆంధ్రాలోని మూడు ప్రాంతాల్లో సంతులనాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాన కార్యదర్శుల మార్పులు

పార్టీ వ్యూహంలో మరో కీలక భాగం ప్రధాన కార్యదర్శుల మార్పులు. కొత్త జాతీయ అధ్యక్షుడి వచ్చే తర్వాత సుమారు 50 శాతం వరకూ ప్రధాన కార్యదర్శులను మార్చే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ, సమర్థత ఆధారంగా బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీలో పని చేసినవారికి పదవులు ఇచ్చే దిశగా నిర్ణయం ఉంది. మంత్రివర్గ విస్తరణలోనూ తెలంగాణ నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆరెస్సెస్ నేపథ్యం సుదీర్ఘ కాలంలో పార్టీలో పని చేస్తున్న నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే వారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

Read also: Historical Monuments : పరిరక్షణ – ప్రతి ఒక్కరి బాధ్యత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ ను చంపేస్తామంటూ బెదిరింపులు?

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

📢 For Advertisement Booking: 98481 12870