Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలో రాజ్యసభకు వెళ్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. సుదీర్ఘ కాలం పాటు బీహార్ రాజకీయాలను శాసించిన నితీశ్, ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలని నిశ్చయించుకున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు తెరలేపారు.
Read Also: Dubai Stranded Passengers: దుబాయ్ బాధితులకు నటుడు సోనూసూద్ భరోసా
ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్ లో, “గడిచిన రెండు దశాబ్దాలకు పైగా బీహార్ ప్రజలు తనపై చూపిన నమ్మకం, మద్దతుకు కృతజ్ఞతలు. ప్రజల మద్దతుతోనే బీహార్ కు పూర్తి నిష్ఠతో సేవ చేయగలిగాను, ఆ బలంతోనే నేడు రాష్ట్రం అభివృద్ధి, గౌరవంలో కొత్త శిఖరాలను తాకుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని రాసుకొచ్చారు.అలాగే తన పార్లమెంటరీ జీవితం ప్రారంభం నుండి.. బీహార్ శాసనమండలిలోని రెండు సభలకు, ప్రాతినిధ్యం వహించాలనే కోరిక తన మనసులో ఉందని నితీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభసభ్యుడిగా వెళ్లాలని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు: నితీశ్ భరోసా
తాను రాజ్యసభ కు వెళ్లినప్పటికీ బీహార్ ప్రజల తో తన సంబంధం భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. “వికసిత బీహార్” నిర్మాణంలో తన సంకల్పం మారదని, రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉంటాయని నితీష్ కుమార్ తన ట్వీట్ లో, పేర్కొన్నారు. దీంతో గత రెండు రోజుల నుంచి నితీష్ కుమార్ రాజ్య సభ కు వెళ్తున్నారనే వార్తలు నిజమయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: