हिन्दी | Epaper

ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై లక్షల కోట్ల బెట్టింగ్!

Vanipushpa
ఢిల్లీ ఎన్నికల్లో గెలుపుపై లక్షల కోట్ల బెట్టింగ్!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ , భారతీయ జనతా పార్టీ మధ్య హోరీహోరీ పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మూడోసారి అధికారం చేపట్టాలని చూస్తుంటే, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కసితో ఉంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. పెద్దగా ఒపీనియన్ పోల్స్ అందుబాటులో లేకపోవడంతో, అందరి దృష్టి రాజస్థాన్‌లోని ఫలోడి సత్తా బజార్ (బెట్టింగ్ మార్కెట్) అంచనాలపైనే ఉంది. ఢిల్లీలో AAP 2015 నుంచి అధికారంలో ఉంది. గత 27 సంవత్సరాల్లో బీజేపీ ఢిల్లీ అధికారంలోకి రాలేదు.
ఫలోడి సత్తా బజార్ అంచనా ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీకి గత ఎన్నికల కంటే తక్కువ స్థానాలే గెలుస్తుంది. 2013లో 28 సీట్లు గెలుచుకున్న ఆప్ 2015లో 70కి గానూ 67 సీట్లు సాధించింది. ఈసారి అధికార పార్టీ 38-40 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ విషయానికి వస్తే, వారికి 30-32 సీట్లు వస్తాయని బెట్టింగ్ మార్కెట్ అంచనా వేస్తోంది. బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది.

కీలక ఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ (ఆప్) వర్సెస్ పర్వేశ్ వర్మ (బీజేపీ) వర్సెస్ సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్) మధ్య పోటీ జరగనుంది. ఇక్కడ కేజ్రీవాల్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. బెట్టింగ్ ఆడ్స్ ఆయనకు 66-85 మధ్య ఉన్నాయి. కల్కాజీ నియోజకవర్గంలో అతిషి (ఆప్), రమేష్ బిధురి (బీజేపీ), అల్కా లాంబా (కాంగ్రెస్) పోటీ పడుతున్నారు. ఇక్కడ అతిషి ముందంజలో ఉన్నారు. ఆమె గెలుపు అవకాశాలు (బెట్టింగ్ ఆడ్స్) 25-33 మధ్య ఉన్నాయి. జంగ్‌పురా నియోజకవర్గంలో మనీష్ సిసోడియా (ఆప్), తర్వీందర్ సింగ్ మార్వా (బీజేపీ), ఫర్హాద్ సూరి (కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ సిసోడియా బెట్టింగ్‌ ఆడ్స్‌ 55-70 మధ్య ఉన్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870