हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మెట్రో ప్రయాణికుల పై ఛార్జీల భారం

Sudheer
మెట్రో ప్రయాణికుల పై ఛార్జీల భారం

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి, దీంతో రోజువారీ ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. కొత్త టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానుండగా, కనిష్ఠ ఛార్జీ రూ.10గా, గరిష్ఠ ఛార్జీ రూ.90గా నిర్ధారించారు. గతంలో గరిష్ఠ ఛార్జీ రూ.60గా ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.90కి పెంచారు. మెట్రో ప్రయాణికుల కోసం దూరాన్ని ఆధారంగా చేసుకుని ఛార్జీలను విభజించారు. 0-2 కిలోమీటర్ల దూరానికి రూ.10, 2-4 కిలోమీటర్లకు రూ.20, 6-8 కిలోమీటర్లకు రూ.40, 8-10 కిలోమీటర్లకు రూ.50, 20-25 కిలోమీటర్లకు రూ.80, 25-30 కిలోమీటర్ల దూరానికి రూ.90గా నిర్ణయించారు.

bengaluru metro charges

ప్రయాణికుల భారం కొంతవరకు తగ్గించేందుకు, స్మార్ట్ కార్డుదారులకు 5% డిస్కౌంట్‌ను కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇది తరచుగా మెట్రోను ఉపయోగించే వారికి కొంతవరకు ఊరటనిచ్చే అంశం. అయితే, సాధారణ టికెట్ ప్రయాణికులు మాత్రం పెరిగిన ఛార్జీలను భరించాల్సి వస్తోంది. మెట్రో ఛార్జీలు పెరగడం వలన సాధారణ ప్రయాణికులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగస్తులు, విద్యార్థులు పెరిగిన ధరలతో అసౌకర్యానికి గురవుతున్నారు. కొంతమంది ప్రయాణికులు ఈ ఛార్జీ పెంపు నిర్ణయంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కూడా ఛార్జీలను 15% పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెట్రో ఛార్జీలు కూడా పెరగడంతో సాధారణ ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతోంది. పెరిగిన ఛార్జీలతో ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అన్వేషించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870