ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా హఠాన్మరణం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించినదే కాదు, యాంటీ ఏజింగ్ మందుల వినియోగంపై తీవ్ర చర్చకు కూడా దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. సహజ జీవనశైలిని పాటిస్తే 150 నుండి 200 సంవత్సరాలు కూడా ఆరోగ్యంగా జీవించవచ్చని ఆయన ప్రకటించారు.

యాంటీ ఏజింగ్ మాయ.. షెఫాలీ మృతి భయానక నిజాలు
నటి షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) మృతిని పోలీసులు విచారించినప్పుడు, ముంబై (Mumbai) లోని ఆమె నివాసంలో పోలీసులు రెండు పెట్టెల నిండా మందులను గుర్తించారు. వాటిలో చర్మ సౌందర్యం కోసం వాడే గ్లూటాథియోన్, విటమిన్ సి ఇంజెక్షన్లు, ఎసిడిటీ మాత్రలు ఉన్నట్లు తేలింది. ఆమె గత ఏడెనిమిదేళ్లుగా వైద్యుల పర్యవేక్షణ లేకుండా సొంతంగానే ఈ యాంటీ ఏజింగ్ చికిత్సలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మనిషి శరీరం ఓ అద్భుతం.. కానీ దాన్ని మనమే నాశనం చేస్తున్నాం
రాందేవ్ మాట్లాడుతూ – ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. “మానవ శరీరం ఒక అద్భుతం. కానీ మన మెదడు, గుండె, కాలేయంపై మనమే ఎక్కువ భారం మోపుతున్నాం. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని 25 ఏళ్లకే తినేస్తున్నాం” అని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు 60 ఏళ్లు దాటినా యోగా, ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి వల్లే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు.
హార్డ్వేర్ బలంగా ఉంది… కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఫెయిలయ్యింది
షెఫాలీ జరీవాలా గతంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇప్పుడు షెఫాలీ జరీవాలా లాంటి యువతరం అకాల మరణాలపై స్పందిస్తూ, “వారి హార్డ్వేర్ బాగున్నా, సాఫ్ట్వేర్ లోపభూయిష్టంగా ఉంది. పైకి కనిపించే లక్షణాలు బాగానే ఉన్నా, శరీర వ్యవస్థ దెబ్బతింది” అని ఆయన వ్యాఖ్యానించారు. పైపై మెరుగుల కన్నా అంతర్గత ఆరోగ్యం చాలా ముఖ్యమని ఆయన సూచించారు.
యాంటీ ఏజింగ్ చికిత్సలు: అంతరంగికంగా పాడుచేస్తున్న ‘సౌందర్యం’
విడుదలైన నివేదికల ప్రకారం, గ్లూటాథియోన్ వంటి ఇంజెక్షన్లు ప్రాథమికంగా లివర్ పనితీరును బలపరిచే ఔషధాలుగా అభివర్ణించబడుతున్నప్పటికీ, అవి ఎక్కువ మోతాదులో తీసుకుంటే హృదయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read also: Railways : నేటి నుంచి రైల్వేల్లో కీలక మార్పులు..
India-China: చైనాతో స్థిరమైన సంబంధాలపై భారత్ దృష్టి : జైశంకర్