हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Asaduddin Owaisi: బహ్రెయిన్‌లో పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

Sharanya
Asaduddin Owaisi: బహ్రెయిన్‌లో పాకిస్థాన్‌పై  అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు

ఉగ్రవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్థాన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదంపై జాతీయ స్థాయిలో ఏకమై పోరాటం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత అఖిలపక్ష బృందంలో భాగంగా బహ్రెయిన్‌లో పాల్గొన్న ఒవైసీ పాకిస్థాన్‌ను “విఫల రాజ్యం”గా అభివర్ణించారు.

పాకిస్థాన్‌కి గట్టి హెచ్చరిక

గత కొన్నేళ్లుగా భారత్ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు గురించి ప్రపంచానికి తెలియజేయడానికే మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు ఈ ఉగ్రవాదం వల్ల మేం ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. ఈ సమస్యకు పాకిస్థాన్ మూల కారణం. ఆ దేశం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడం ఆపేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు అని ఒవైసీ స్పష్టం చేశారు.

పహల్గామ్ దాడి

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిని ఉదాహరిస్తూ ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఒవైసీ తెలిపారు. పాకిస్థాన్ మరోసారి ఇలాంటి దుస్సాహసానికి పాల్పడితే వారు ఊహించని దానికంటే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుంది అని హెచ్చరించారు. తీవ్రమైన కవ్వింపు చర్యలు ఎదురైనా భారత్ ఎప్పుడూ సంయమనం పాటిస్తూ వస్తోందని గుర్తుచేశారు. పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదం సృష్టిస్తున్న మానవ విషాదాన్ని ఆయన వివరించారు. ఆరు రోజుల క్రితం పెళ్లయిన మహిళ ఏడో రోజే వితంతువుగా మారింది. రెండు నెలల క్రితం వివాహమైన మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. మా రాజకీయ అభిప్రాయాలు వేరైనా, దేశ సమగ్రత విషయంలో మేమంతా ఒక్కటే. ఈ విషయాన్ని మా పొరుగు దేశం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అని ఒవైసీ అన్నారు.

అంతర్జాతీయ మద్దతు అవసరం

పాకిస్థాన్ లాంటి విఫల రాజ్యం నుంచి వస్తున్న అన్ని రకాల ముప్పులను మన వాయు రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి అని ఆయన తెలిపారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారం చాలా అవసరమని ఒవైసీ పేర్కొన్నారు.

ప్రతినిధి బృంద పర్యటన లక్ష్యం

భారత ప్రభుత్వం ప్రతి పౌరుడి భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పాక్ ముప్పును ఎదుర్కొనే శక్తి, సాంకేతిక సామర్థ్యం మనకు ఉంది. మన భద్రతా వ్యవస్థలు మేల్కొన్నవిగా ఉన్నాయి అని ఒవైసీ నొక్కిచెప్పారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏర్పడిన ఈ అఖిలపక్ష బృందంలో నబీ ఆజాద్, బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, ఫాంగ్నాన్ కొన్యాక్, ఎన్‌జేపీ ఎంపీ రేఖా శర్మ, ఎంపీ సత్నామ్ సింగ్ సంధు, రాయబారి హర్ష్ ష్రింగ్లా తదితరులు ఉన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ స్పందన, సీమాంతర ఉగ్రవాదంపై దేశం సాగిస్తున్న పోరాటం గురించి అంతర్జాతీయ భాగస్వాములకు వివరించడమే ఈ బృందం పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా దేశాల్లో పర్యటించనుంది. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని స్పష్టం చేయడం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం ఈ పర్యటన లక్ష్యాల్లో భాగం.

Read also: UPSC: నేడే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870