Telugu News: Arcelor Mittal: దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు ప్రాజెక్ట్ నిప్పాన్ స్టీల్స్

Read Time:  1 min
Arcelor Mittal
Arcelor Mittal
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడికి మార్గం సుగమమైంది. అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్ (ArcelorMittal) మరియు నిప్పాన్ స్టీల్స్ (Nippon Steels) సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ కీలకమైన పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. ఈ ప్రక్రియ కేవలం 14 నెలల రికార్డ్ టైమ్‌లో సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

read also: Banglore: లైట్లు ఆఫ్ చేయమన్నందుకు.. డంబెల్‌తో హత్య చేసిన యువకుడు

Arcelor Mittal
Arcelor Mittal

ప్రాజెక్టు వివరాలు, లక్ష్యం

ఈ ఉక్కు పరిశ్రమను రూ.1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే,(ArcelorMittal) ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా స్థాపించబడే) ఫ్యాక్టరీగా నిలవనుంది. ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడంతో, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ఇది ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజ కార్యక్రమం ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ (CII) సదస్సు సందర్భంగా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన అనుమతి ప్రక్రియ కారణంగానే ఈ భారీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి సిద్ధమైంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.