हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Maoists : మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

Sudheer
Maoists : మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరిన్ని నష్టాలను ఎదుర్కొన్నారు. బీజాపూర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14 మంది తలలకు రూ. 68 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ లొంగుబాటు, మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర కుదుపునివ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Massive encounter in Chhattisgarh.. 16 Maoists killed

మావోయిస్టులకు పునరావాసం

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల లొంగుబాటుతో అడవి ప్రాంతాల్లో శాంతి నెలకొనే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. గతంలోనూ అనేక మంది మావోయిస్టులు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా లొంగిపోయి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో 25 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయం గమనార్హం.

నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొన్ని గంటల్లో ఛత్తీస్‌గఢ్ పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ లొంగుబాటు జరగడం విశేషంగా మారింది. భద్రతా బలగాల వ్యూహాత్మక చర్యలు, ప్రభుత్వ పునరావాస విధానాలు మావోయిస్టు ప్రభావాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బీజాపూర్, దాంతేవాడ ప్రాంతాల్లో ఇలాంటి లొంగుబాట్లు జరుగడం శాంతి స్థాపనకు సహాయపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870