हिन्दी | Epaper

కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

Sudheer
కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

  • మరింత ముదిరిన శీష్‌మహల్ వివాదం

దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది నెలలుగా చర్చనీయాంశంగా మారిన శీష్‌మహల్ వివాదం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరణ పేరిట భారీగా ఖర్చు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై రావడం రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా, బీజేపీ నేతలు ఈ వ్యయాన్ని ప్రజా ధన దుర్వినియోగంగా పేర్కొంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

delhi chief minister arvind kejriwal 311736703 1x1

ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల విభాగం తన నివేదికను సమర్పించిన అనంతరం, నరేంద్ర మోదీ ప్రభుత్వం శీష్‌మహల్‌ పునరుద్ధరణలో నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక విచారణ జరిపించాలని నిర్ణయించింది. 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంపై భారీగా ఖర్చు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడం కీలక అంశాలుగా మారాయి.

టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు

బీజేపీ నేతలు ఈ ఆధునీకరణలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు, స్విమ్మింగ్ పూల్, మినీ బార్‌ వంటి లగ్జరీ సదుపాయాల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తం రూ.80 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు కేంద్రం ఆదేశించడం గమనార్హం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. మరోవైపు, 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కీలక నేతలు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు పరాజయం పాలయ్యారు.

బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం

ఇప్పటికే బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే, కొత్త ప్రభుత్వం ఈ శీష్‌మహల్‌ భవనాన్ని అధికార నివాసంగా ఉపయోగించదని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870