డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న ఈ కాలంలో బ్యాంకింగ్ మోసాలు (Spam Calls) కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్ల ద్వారా సామాన్యులను మోసం చేస్తూ వారి ఖాతాల్లోని డబ్బును కాజేసే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ చెప్పమని, కేవైసీ అప్డేట్ చేయాలంటూ వచ్చే కాల్స్ వల్ల ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు భద్రత కల్పించేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఒక సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని తీసుకొచ్చింది. అదే ఎయిర్టెల్ AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్.
Read Also: AI :ఆంత్రోపిక్ సేఫ్గార్డ్స్ చీఫ్ మృణాంక్ శర్మ రాజీనామా
ఈ ఫీచర్ కీలకం
మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.ప్రస్తుతం బ్యాంకింగ్ మోసాల్లో ఎక్కువగా వినిపిస్తున్న విషయం ఓటీపీ.

“మీ ఖాతా బ్లాక్ అవుతుంది”, “రిఫండ్ ప్రాసెస్ చేయాలి”, “కేవైసీ పూర్తి చేయాలి” అంటూ భయపెట్టి ఓటీపీ తెలుసుకుని ఖాతాను ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా మోసాలను అడ్డుకోవడంలో ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ కీలకంగా మారనుంది. ముందే హెచ్చరిక రావడంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడకుండా ఉండే, అవకాశం ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: