ఇటీవలి ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయాన్ని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవాలని చూసిందని బీజేపీ (BJP) ఆరోపించింది. విజయం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తాజాగా విడుదలైన ప్రభుత్వ నివేదిక రాజకీయ దుమారానికి దారితీసింది.సదరు నివేదికలో విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీపై నేరుగా వేలు చూపించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం దాచిపెట్టేందుకు ఇటువంటి నిందలు వేయడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. నిజంగా ఆర్సీబీదే తప్పైతే పోలీస్ అధికారులపై చర్యలు ఎందుకు తీసుకున్నారని నిలదీశారు.

విరాట్ను రాజీగా వాడుకుంటారా?
ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆహ్వానం పలికారని, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు పౌరులకు మళ్లీ మళ్లీ పిలుపునిచ్చారని బీజేపీ నేత అరవింద్ మండిపడ్డారు. ఆ వేడుక విజయాన్ని తమ క్రెడిట్గా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ నాయకులు ముందుకు వచ్చారని ఆరోపించారు.ఆర్సీబీ ఈవెంట్ నిర్వహిస్తామని ముందుగా తెలిపిందని, అప్పటిలోనే అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం దాన్ని ఆపేయొచ్చని బీజేపీ గుర్తు చేసింది. ప్రభుత్వమే ప్రొగ్రాంకు అనుమతి ఇచ్చి, తరువాత బాధ్యత వదులుకోవడం చింతించదగిన పరిణామమన్నారు. ఇటువంటి దారుణ ఘటనపై గట్టిగా స్పందించాల్సింది పోయి, నాయుకుడిపై ఒత్తిడి తేవడమేమిటని ప్రశ్నించారు.
ప్రశ్నలు మిగిలిపోయిన నివేదిక
ఈ నివేదికతో రాజకీయ విమర్శలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం కోహ్లీ (Virat Kohli) , ఆర్సీబీపై నిందలు వేయడం వల్ల అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజంగా బాధ్యులు ఎవరు? అసలైన సత్యం బయటపడే వరకు ఈ వివాదం కొనసాగనుంది.సాధారణమైన క్రికెట్ వేడుకను రాజకీయ రంగంలోకి లాగడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. విరాట్ను రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also : KTR : రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ ఆగ్రహం