हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

sumalatha chinthakayala
ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రానున్న ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అధికార ఆప్‌ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో మొత్తం 31 మందిని ప్రకటించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సొంత బలంతో ఎన్నికల్లో గెలుపొందుతుంది. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తుకూ అవకాశం లేదు అని కేజ్రీ వెల్లడించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్‌ సీట్ల పంపకం కోసం ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుపుతోందంటూ వార్తలు వస్తున్నాయి. కూటమిలోని కాంగ్రెస్‌కు 15 సీట్లు, ఇతర పార్టీలకు ఒకటి లేదా రెండు సీట్లు కేటాయించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన కేజ్రీ.. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా స్పష్టతనిచ్చారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ ఎన్నికల కోసం రెండు విడతలుగా అభ్యర్ధుల జాబితాల్ని కూడా విడుదల చేసింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870