हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆధార్ ప్రామాణీకరణకు ఇక సులభం

Sharanya
ఆధార్ ప్రామాణీకరణకు ఇక సులభం

భారతదేశ పౌరులకు ఆధార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలు, మొబైల్ కనెక్షన్లు, పాన్ కార్డు లింక్ వంటి అనేక అవసరాలకు ఆధార్ ప్రామాణీకరణ ముఖ్యంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ప్రామాణీకరణ సేవలను మెరుగుపరచడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా “ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్” ను ప్రారంభించింది.

aadhaar.jpg

ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ లక్ష్యం ఏమిటి?

ఈ పోర్టల్ ప్రారంభం వెనుక ప్రధాన ఉద్దేశం ఆధార్ ప్రామాణీకరణ అభ్యర్థనల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం. సర్కారు విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ రంగం, విద్యాసంస్థలు, ఈ-కామర్స్ సంస్థలు వంటి వివిధ విభాగాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఆధార్ చట్టం – 2016 ప్రకారం, పౌరులకు రాయితీలు, ప్రయోజనాలు అందించడంలో ఇది కీలక భూమిక పోషిస్తుంది.

పోర్టల్ ద్వారా పొందే ప్రయోజనాలు

ప్రభుత్వ సేవల్లో వేగవంతమైన ప్రామాణీకరణ
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన రాయితీలు, నిధుల పంపిణీని సులభతరం చేయడం. ఆధార్ లింక్ చేసుకోవడం ద్వారా అవకతవకలను నివారించడం.
ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు
ఆసుపత్రుల్లో రోగి ధ్రువీకరణను వేగవంతం చేయడం.
హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం తగ్గించడం.
విద్యారంగంలో ఆధార్ వాడకాలు
పరీక్షల సమయంలో విద్యార్థుల ప్రామాణీకరణ సులభతరం చేయడం.
స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల వివరాల దృవీకరణను వేగంగా చేపట్టడం.
ఈ-కామర్స్ & ఆర్థిక రంగ సేవలు
ఈ-కేవైసీ (e-KYC) ద్వారా సురక్షిత లావాదేవీలు చేయడం.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ క్రెడిట్ రేటింగ్, రుణాల ప్రాసెసింగ్ వేగవంతం చేయడం.
సంస్థల హాజరు మానిటరింగ్
కార్యాలయాల్లో సిబ్బంది హాజరు పద్ధతులను ఆధార్ ఆధారంగా నిర్వహించుకోవచ్చు.
హెచ్‌ఆర్ ధ్రువీకరణ ప్రక్రియలు మరింత సమర్థవంతంగా చేసుకోవచ్చు.

పోర్టల్‌లో నమోదు ప్రక్రియ – ఎలా అప్లై చేయాలి?

ఈ పోర్టల్‌ను ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణ సేవలను పొందేందుకు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది: అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి ,సంస్థ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి ,ప్రామాణీకరణ సేవల అవసరాన్ని వివరించాలి , ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోద ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆమోదం లభించిన తర్వాత, ఆధార్ ప్రామాణీకరణ సేవలను తమ యాప్‌లు, వెబ్‌సైట్‌లో అనుసంధానం చేసుకోవచ్చు

పోర్టల్ లాంచ్‌పై ప్రముఖుల అభిప్రాయాలు

ఎంఈఐటీవై కార్యదర్శి ఎస్. కృష్ణన్ మాట్లాడుతూ –
“ఈ కొత్త పోర్టల్ వల్ల ఆధార్ ప్రామాణీకరణలో వేగవంతమైన సర్వీసులు అందించగలుగుతాం. ఇది సుపరిపాలనలో నూతన శకం తెరుస్తుంది.”

యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్
“ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు సైతం తమ కస్టమర్ ఫేసింగ్ యాప్‌లలో ఆధార్ సేవలను సరళీకృతంగా అనుసంధానం చేసుకోవచ్చు.”

ఈ పోర్టల్ ఎందుకు ప్రత్యేకం?

ఆధార్ సేవల వినియోగంలో వేగవంతమైన ప్రాసెసింగ్ , ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సరళమైన ఆమోద విధానం , ఆధార్ చట్టం 2016 ప్రకారం పూర్తిగా లీగల్ , భవిష్యత్తులో మరిన్ని ఆధార్ ఆధారిత సేవలకు మార్గం సుగమం ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ప్రవేశపెట్టడం డిజిటల్ ఇండియా దిశగా తీసుకున్న మరో బలమైన అడుగు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య ఆధార్ సేవలను అనుసంధానం చేయడంలో కొత్త మార్గాలను తెరిచేలా ఉంది. త్వరలోనే ఈ పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆధునిక సాంకేతికతతో ఆధార్ సేవలను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870