हिन्दी | Epaper

ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..

sumalatha chinthakayala
ఢిల్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు షాక్‌..

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రి.. పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా ఓటింగ్‌కు 5 రోజులు ఉండగా.. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు బిగ్ షాకిచ్చారు. ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ పంపించారు. ఈ ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించకపోవడంతోనే.. పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తోందని.. ఆ లేఖలో ఎమ్మెల్యేలు వెల్లడించారు. గతంలో ఆప్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన ఈ ఏడుగురికి ఈసారి పార్టీ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

image

మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్.. త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ కుమార్.. జనక్‌పురి ఎమ్మెల్యే రాజేష్ రిషి.. కస్తుర్బానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్.. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ.. పాలం ఎమ్మెల్యే భావన గౌడ్.. బిజ్వాసన్ ఎమ్మెల్యే బీఎస్ జూన్‌.. శుక్రవారం ఆప్‌కు రాజీనామా చేశారు. ఇక తన రాజీనామా లేఖలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పాలెం ఎమ్మెల్యే భావ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేజ్రీవాల్‌పై నమ్మకం పోయిందని పేర్కొన్నారు.

ఇక మెహ్రౌలీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఖురాన్ అపవిత్రం కేసులో నరేష్ యాదవ్‌ను గతేడాది డిసెంబరులో పంజాబ్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో అతడికి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ ఈ తీర్పుపై నరేష్ యాదవ్ స్టే తెచ్చుకున్నారు. అయితే ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విడుదల చేసిన ఐదో జాబితాలో మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి నరేష్ యాదవ్ స్థానంలో మహేందర్ చౌదరిని అభ్యర్థిగా ఆప్ ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

📢 For Advertisement Booking: 98481 12870