हिन्दी | Epaper

Air India Plane Crash : 202 మృతదేహాల గుర్తింపు

Sudheer
Air India Plane Crash : 202 మృతదేహాల గుర్తింపు

ఈ నెల 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash ) దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ భయానక ప్రమాదంలో మొత్తం 279 మంది ప్రాణాలు (279 Dies) కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతుల గుర్తింపులో అధికారులు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 202 మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

157 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింపు

గుర్తించబడిన మృతదేహాల్లో 157 మృతుల దేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు, 11 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అధికారులు శేష మృతదేహాల గుర్తింపు ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు. DNA పరీక్షలు, బహుళ స్థాయిలో తీసిన శరీర అవశేషాల తాలూకు విశ్లేషణ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతి

ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోవడం ఘటనను మరింత విషాదంగా మార్చింది. దేశంలోని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్స్ సహాయ చర్యలు కొనసాగిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందిస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.

Read Also : Chiranjeevi : అనిల్ మూవీ లో చిరు పాత్ర పేరు అదేనా..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870