हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం

Vanipushpa
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యానించారు. ఏకలవ్యుని బొటనవేలు తీసుకుని ద్రోణుడు అతడిని విలువిద్యకు దూరం చేసినట్లే.. ప్రభుత్వం ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తోందనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత జీవితాలతో ఆటలు వద్దు
కేంద్ర ప్రభుత్వ విధానాలు యువత జీవితాలతో ఆడుకుంటున్నదని, అనేకులు నిరాశలో జీవిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేసారు. ‘సైన్యంలోకి అగ్నివీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను నరికేశారు. ఏకంగా 70 పరీక్షల పేపర్‌ లీకేజీలు జరిగినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను తెగగొట్టారు. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ బయట దేశ రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. లాఠీచార్జి చేస్తున్నారు. రైతులు మిమ్మల్ని కనీస మద్దతు ధర కల్పించమని కోరుతున్నారు. తమ పంటకు తగ్గ ధర కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం అదానీ, అంబానీలకు లాభాలు కట్టబెట్టి రైతుల బొటన వేళ్లను నరికేశారు’ అని రాహుల్ గాంధీ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మేం దేశ ప్రజలకు అభయముద్ర గురించి చెబుతున్నాం. భయం వద్దు, ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నాం. మీరు మాత్రం వారి బొటన వేళ్లను నరికేస్తాం అంటున్నారు. మీకూ, మాకు ఉన్న తేడా అదే’ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ కనిపించారు. శుక్రవారం తొలిసారి లోక్‌సభలో ప్రసంగించిన ప్రియాంకాగాంధీ కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870