हिन्दी | Epaper

బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు

Vanipushpa
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం మరోసారి సిద్దమవుతోంది. ఈసారి కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే గత ఆరేళ్లలో తొలిసారి ఈ స్ధాయిలో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉంటాయని సమాచారం.గ్రామీణ ఆదాయం పెంపు, ధరల తగ్గింపు లక్ష్యంగా వ్యవసాయ రంగానికి ఇచ్చే కేటాయింపుల్ని 15 శాతానికి పైగా పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి బడ్జెట్ లో ఈ మేరకు వ్యవసాయ రంగానికి దాదాపు లక్షా 75 వేల కోట్ల నిధులు కేటాయిస్తారని సమాచారం. ఈ సంవత్సరం లక్షా 52 వేల కోట్ల కేటాయింపులు వ్యవసాయ రంగానికి చేశారు. దాన్ని లక్షా 75 వేల కోట్లకు పెంచుతారని తెలుస్తోంది. అలాగే ఈ అదనపు కేటాయింపుల్ని కీలక అంశాలకు కేటాయించనున్నారు.

మరోవైపు బియ్యం, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం గతేడాది అక్టోబర్ లో ఏటా 10 శాతం దాటిపోయిన ఆహార ధరలతో ఇబ్బందులు పడుతోంది. దీంతో కేంద్రం ఈ మార్పుల్ని బడ్జెట్ లో ప్రతిపాదించబోతోంది. ఇప్పటికే కేంద్రం పెరుగుతున్న ధరల నియంత్రణకు కొన్ని పప్పు ధాన్యాల సుంకం రహిత దిగుమతి విధానాన్ని పొడిగించడంతో పాటు గోధుమలతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతిపై ఆంక్షలు కూడా విధించింది. వ్యవసాయ ఎగుమతులను 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల నుండి 80 బిలియన్ డాలర్లకు పెంచడానికి ప్రభుత్వం మిగులు ఉత్పత్తి చేయాలని కూడా ప్రయత్నిస్తోంది.దీని కోసం ఈసారి బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870