हिन्दी | Epaper

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

Sukanya
నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

బీహార్‌లోని పాట్నాలో జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ను గాంధీ మైదానంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, కిషోర్ ను బలవంతంగా అంబులెన్సులో ఎయిమ్స్కు తరలించి, ఇతర నిరసనకారుల నుండి వేరుచేశారు.

అధికారుల ప్రకారం, ప్రశాంత్ కిషోర్ చికిత్సకు నిరాకరించారు. “మరణం వరకు నేను నిరాహార దీక్షను కొనసాగిస్తాను” అని ఆయన స్పష్టంగా చెప్పారు.

పెద్ద సంఖ్యలో పోలీసులు కిషోర్ను నిరసన స్థలం నుండి తొలగించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు ఉన్నాయి వీడియో ఉన్నాయి. కిషోర్ అనుచరులు అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు, కానీ పోలీసులు వారిని అక్కడి నుండి తొలగించారు.

నిరాహార దీక్షలో ప్రశాంత్ కిషోర్ అరెస్టు

ప్రశాంత్ కిషోర్ జనవరి 2 నుండి విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) నిర్వహించిన 70వ కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

ఈ సందర్భంలో, కిషోర్ మీడియాతో మాట్లాడుతూ, “మేము దీనిపై హైకోర్టుకు వెళ్తాం. జనవరి 7న పిటిషన్ దాఖలు చేస్తాం. నిరసన కొనసాగించాలా లేదా అనేది మా నిర్ణయం. కానీ మా ఆందోళనలో ఎలాంటి మార్పు ఉండదు,” అని చెప్పారు.

ప్రశాంత్ కిషోర్ నిరసన స్థలానికి సమీపంలో విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన ‘వానిటీ వాన్’ నిలిపి ఉండటం వివాదానికి కారణమైంది. ప్రత్యర్థులు ఈ వాహనాన్ని చూపించి, కిషోర్ నిజాయితీపై ప్రశ్నించారు.

ఈ ఆరోపణలకు ఆయన కౌంటరిచేస్తూ, “నిరాహార దీక్షలో ఉన్న నేను బాత్రూమ్ కోసం ఇంటికి వెళితే, తిన్నానని లేదా విశ్రాంతి తీసుకున్నానని కొందరు ఆరోపణలు చేస్తారు. అందుకే వాన్ అవసరమైంది. నేను బస్సులో ఉండనప్పుడు, అది నా నియమాలకు అనుగుణంగా ఉంటుంది,” అన్నారు.

అలాగే, “కొంతమంది వాన్ ఖరీదు 4 కోట్లు అని, 25 లక్షల అద్దెకు తీసుకున్నామని అంటున్నారు. అలా అయితే, ఆ అద్దె నాకిచ్చి చూడండి. ప్రజలు ఎంత వరకు అనవసర ఆరోపణలు చేయగలరో ఇదే ఉదాహరణ,” అని కిషోర్ తెలిపారు.

ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఈ నిరసన విద్యార్థుల డిమాండ్లను గట్టిగా ప్రాతినిధ్యం చేస్తోంది. ఈ నిరసనపై ప్రభుత్వ చర్యలు, కిషోర్ నిర్ణయాలు ఇప్పటికీ చర్చకు కేంద్రబిందువుగా మారాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870