త్వరలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమతమ జాబితాల లిస్టును తయారు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్ను శనివారం రిలీజ్ చేసింది.
న్యూ ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ ను బరిలోకి దింపింది.

కైలాశ్ గెహ్లాట్ కు తొలి జాబితాలో చోటు
ఇక ఇటీవలే ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ కు తొలి జాబితాలో చోటు దక్కింది. ఆయన్ని బిజ్వాసన్ స్థానం నుంచి పోటీకి దింపింది. కరోల్బాగ్ నుంచి దుశ్యంత్ చౌటాలా, రాజౌరీ గార్డెన్ నుంచి మాజిందర్ సింగ్, గాంధీ నగర్ నుంచి అరవిందర్ సింగ్ లవ్లీ పోటీ చేయబోతున్నారు. పూర్తి లిస్ట్ ఈ కింది ట్వీట్లో ఉంది.