Nara Lokesh returned from Davos

దావోస్ నుంచి తిరిగొచ్చిన లోకేష్

అమరావతి: ఐదు రోజుల దావోస్ పర్యటన ముగించుకున్న ఏపీ విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్వదేశానికి తిరిగొచ్చారు. శనివారం తెల్లవారుజామున 1.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు ప్రముఖులతో సమాదేశమై ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరిపారు.

యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా 4 రోజుల పాటు దావోస్ వేదికగా బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేశారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లి రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్ కు ఉన్న అనుకూల పరిస్థితులను, కూటమి ప్రభుత్వ సహకారంపై దిగ్గజ సంస్థల అధినేతలతో నారా లోకేష్ సమావేశమై చర్చలు జరిపారు. త్వరలోనే వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోనున్నారు.

image

పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు అవుతూనే మరోవైపు నారా లోకేష్ 8 రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు హాజరై కూటమి ప్రభుత్వ పాలసీలు, చంద్రబాబు విజన్ ను వారికి వివరించారు జూన్ నెలలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తీసుకుంటున్న పారిశ్రామిక విధానాల నిర్ణయాలు, ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ (AI), క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, ఎకో ఫ్రెండ్లీ వ్యాపార అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో లోకేష్ చర్చలు జరిపారు.

దావోస్ లో జరిగిన పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ లో బ్రాండ్ ఏపీని మంత్రి నారా లోకేష్ ప్రమోట్ చేసి పెట్టుబడుల కోసం శ్రమించారు. మొత్తం 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

Related Posts
మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇక ఆ బోర్డ్స్ కనిపించవు
wine shops telangana

వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం తెలంగాణ మందుబాబులకు గుడ్‌న్యూస్. వేసవి రాకముందే బీర్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని వేగవంతం చేశాయి. ఇటీవల ప్రభుత్వ Read more

హైదరాబాద్ లో సస్టైనబల్ ఉన్నత విద్య కోసం యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, సిమెన్స్, మరియు టి -హబ్ భాగస్వామ్యం
University of East London Siemens and T Hub partnership for sustainable higher education in Hyderabad

హైదరాబాద్ : యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్), సిమెన్స్ యుకె మరియు టి -హబ్ హైదరాబాద్‌ సంయుక్తంగా 13 నవంబర్ 2024న సస్టైనబిలిటీ ని ముందుకు Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి
Delhi CM Atishi exercised the right to vote

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిషి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో సీఎం అతిషి ఓటు వేశారు. ఓటు వేసే ముందు Read more

Tushar Gandhi: తుషార్‌ గాంధీ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్‌
BJP demands arrest of Tushar Gandhi

Tushar Gandhi: మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీని అరెస్ట్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. తుషార్‌ ఇటీవల తిరువనంతపురంలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌ చాలా Read more