हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

Vanipushpa
నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

నంద్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. జమ్మలమడుగు నుంచి తాడిపత్రికి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కలవటాల దాటగానే ప్రమాదానికి గురైంది. కలవటాల వద్దకు రాగానే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసిన డ్రైవర్ ఓ చేయి స్టీరింగ్ మీద, మరో చేతితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తాపడింది.

నంద్యాల: ఆర్టీసీ బస్సు బోల్తా..20 మందికి గాయాలు

ప్రభుత్వ ఆస్పత్రులకు తరలింపు
బస్సు ఒక్కసారిగా బోల్తాపడటంతో అందులోని ప్రయాణికులు భయపడిపోయారు. బస్సు ముందు భాగంలోని అద్దాలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లెలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. గాయపడిన వారి అరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆరా తీశారు. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులను వివరణ కోరారు.

లారీ- ట్రాక్టర్ ఢీ.. ఒకరు మృతి
మరోవైపు నంద్యాల జిల్లా డోన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయాడు. జగనన్న కాలనీలో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టరును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టరు తలకిందులుగా పడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న ఉన్న చలపతి అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురు హమాలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870