हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

Vanipushpa
ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామస్థులు గుర్తుతెలియని వ్యాధితో వణికిపోతున్నారు. ఇప్పటివరకు ఆ వ్యాధితో గత నెల రోజుల కాలంలోనే ఆ గ్రామంలో 13 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సుక్మా జిల్లాలోని ధనికోర్తా గ్రామంలో ఈ వింత వ్యాధి ప్రబలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంతుచిక్కని వ్యాధితో ఒకరి తర్వాత ఒకరు ఇలా నెల రోజుల్లోనే 13 ప్రాణాలు పోవడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళలో పడ్డారు. ఇక ఆ విషయం తెలియగానే ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ధనికోర్తా గ్రామానికి మెడికల్ సిబ్బందిని పంపించి.. గ్రామస్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు ఆ మిస్టరీ వ్యాధి ఏంటా అని ఆరా తీస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో అంతుచిక్కని వ్యాధితో 13మంది మృతి

ధనికోర్తా గ్రామంలో వరుసగా చనిపోతున్న వారికి కొన్ని లక్షణాలు ఉన్నట్లు స్థానికులు వెల్లడించారు. బాధితులు చనిపోయే ముందు వరకు కూడా ఛాతీ నొప్పి, నాన్‌స్టాప్‌గా దగ్గు వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఒడిశా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆ ధనికోర్తా గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ వ్యాధి బాధితులు ఉన్నారని, వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొంటుండటం మరింత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి వివరణ
ఇక ఈ అంతుచిక్కని వ్యాధి గురించి వస్తున్న వార్తలపై సుక్మా జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మీడియాకు వెల్లడించారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అయితే ఆ ఐదుగురిలో ముగ్గురు వృద్ధాప్య సమస్యలతో చనిపోయినట్లు తెలిపారు. మిగతా ఇద్దరి మృతికి గల కారణాలను ఇంకా పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం.. వాతావరణంలో మార్పులు, మహువా పంట సేకరణ కారణంగా ఈ వింత వ్యాధితో గ్రామస్థులు చనిపోతున్నట్లు అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మహువా పంట సేకరణ కోసం గ్రామస్థులు రోజు మొత్తం అటవీ ప్రాంతంలోనే ఉంటారని.. అందువల్ల వారు డీహైడ్రేషన్‌కు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870