Ustad Bhagat Singh : టాలీవుడ్లో అత్యంత ఆసక్తికర కాంబినేషన్లలో ఒకటైన పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ జోడీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్బస్టర్ అందించిన ఈ కాంబో, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 26న సినిమా విడుదల కానుందని సమాచారం.
Read Also: ICC: ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్ చక్రవర్తి

అయితే, కొంతకాలంగా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సోషల్ మీడియాలో హరీశ్ శంకర్ను ట్యాగ్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ స్పందిస్తూ, అభిమానుల ఆత్రుతను అర్థం చేసుకుంటున్నానని తెలిపారు.
“ప్రతి అప్డేట్కు సరైన సమయం ఉంటుంది. మమ్మల్ని నమ్మండి… సెలబ్రేషన్స్ త్వరలోనే మొదలవుతాయి. సినిమా వెనుక చాలా కష్టం ఉంటుంది. మేము ఇచ్చే ప్రతి అప్డేట్ను మీరు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు” అని ఆయన పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: