టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి పలికి, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం (మార్చి 8) కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ప్రైవేట్గా జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న శ్రీనివాస్, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, నటి సంయుక్త మీనన్ వంటి వారు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Also : YS Sharmila statement : నారీశక్తి వట్టిమాటే, మోదీ, చంద్రబాబుపై షర్మిల ఫైర్
శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వివరాలను బెల్లంకొండ కుటుంబం ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడించనప్పటికీ, సోషల్ మీడియా కథనాల ప్రకారం ఆమె పేరు కావ్య రెడ్డి అని తెలుస్తోంది. ఆమె చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, హైదరాబాద్లోని ఒక గౌరవనీయమైన విద్యావంతుల కుటుంబానికి చెందిన వారని ప్రచారం జరుగుతోంది. ఆమె తాతగారు జడ్జిగా, తండ్రి లాయర్గా సేవలందిస్తున్నట్లు సమాచారం. ఈ నిశ్చితార్థంపై త్వరలోనే బెల్లంకొండ సురేష్ కుటుంబం అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఏడాది చివర్లోనే అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీనివాస్ తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :