హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ TG విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈసారి సాధారణ షెడ్యూల్ కంటే కొంచెం ముందుగానే జరగనున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా అదే మార్గంలో అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పరీక్షలు ఇంటర్ బోర్డు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి రెండు విభిన్న టైం టేబుళ్లు పంపించింది. వీటిని పరిశీలించిన తర్వాత ఆమోదం లభిస్తే 2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు (Inter exams) ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్రెడ్డి ఉన్నందున, ఆయన ఆమోదం అనంతరం తుది షెడ్యూల్ విడుదల చేయనున్నారు.
TG: తెలంగాణ ఆలయాల్లో కానుకల సమర్పణకు ఇ-హుండీలు

TG
విద్యార్థులకు లాభం
కరోనా ముందు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే జరిగేవి. కానీ మహమ్మారి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మార్చిలోనే నిర్వహించబడుతున్నాయి. ఇప్పుడు మళ్లీ పాత షెడ్యూల్ వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. ఇలా జరిగితే JEE మెయిన్స్, NEET, EAPCET వంటి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు మరింత సమయం సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. గత సంవత్సరం ఇంటర్ పరీక్షలు మార్చి 5న ప్రారంభమవడంతో, విద్యార్థులకు కేవలం 12 రోజులు మాత్రమే సన్నద్ధతకు దొరికాయి. TG దీంతో ఈసారి ముందుగా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఫీజు పెంపుపై ఆలోచన
ఇంకా ఒక ముఖ్యమైన అంశం – ఇంటర్ పరీక్షల ఫీజు పెంపు. బోర్డు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ₹520, ప్రాక్టికల్స్ ఉన్న కోర్సులకు ₹750 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం, ఈ ఫీజు వరుసగా ₹600 మరియు ₹875కు పెరగొచ్చని సమాచారం. రేవంత్ సర్కార్ ఆమోదిస్తే ఈ మార్పు త్వరలో అమల్లోకి రానుంది.
పరీక్షలకు సిద్ధమవుతున్న 9 లక్షల మంది
గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఈసారి ఫిబ్రవరిలోనే పరీక్షలు మొదలైతే విద్యార్థులకు ఒత్తిడి తగ్గి, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం ఎక్కువగా దొరకనుంది.
తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి?
2026 ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ప్ర: ఈసారి పరీక్షలు ముందుగా ఎందుకు నిర్వహిస్తున్నారు?
విద్యార్థులు JEE, NEET, EAPCET వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సమయం దొరకడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: