AndhraPradesh:ఒకే గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్‌

AndhraPradesh:ఒకే గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్‌

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కేన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది.పచ్చటి పొలాలు, విలాసవంతమైన భవంతులు, నిత్యం వ్యవసాయంతో హాయిగా జీవిస్తున్న గ్రామస్తులు ఇప్పుడు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.ఏడాదిలో 200 మంది కేన్సర్ బారినపడగా, 30 మంది మరణించారు.కాలుష్యమే ప్రధాన కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

16 వేల జనాభా

16 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో కేన్సర్ వ్యాప్తికి అసలు కారణం ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. కేన్సర్‌తో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు కూడా గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించింది. కేన్సర్ వ్యాధి విజృంభణను నియంత్రించేందుకు గ్రామంలో వైద్య బృందాలు శిబిరాలను నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఎస్పీఎం విభాగాధిపతి సుజాత ఆధ్వర్యంలో 93 మంది వైద్యసిబ్బంది 31 బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు.

స్క్రీనింగ్ పరీక్షలు

సోమవారం కేన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఎవరైనా ఆ కుటుంబంలో కేన్సర్ బారిన పడ్డారా? వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలు సేకరించారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 23 మంది కేన్సర్‌ రోగులు ఈ ఆర్ధిక సంవత్సరంలో చికిత్స పొందినట్టు కలెక్టర్‌ వెల్లడించారు.

newindianexpress 2025 03 22 3ftwmurl Collecto

నీటి నమూనాలు సేకరణ

భూగర్భ జలాలు, వాయు కాలుష్యం కేన్సర్ వ్యాప్తికి కారణమై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు గ్రామంలోని 25 ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. ఈ నివేదిక రెండు రోజుల్లో రానుందని అధికారులు తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉన్న గ్రాసిమ్ పరిశ్రమ వల్లే కాలుష్యం తీవ్రంగా పెరిగి, దీనికి ఫలితంగా కేన్సర్ కేసులు పెరిగాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ దర్యాప్తుతో అసలు కారణం ఏంటో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

జాగ్రత్తలు

కేన్సర్‌ను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యంత అవసరం. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం,మద్యం, పొగత్రాగటం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను మానుకోవడం మంచిది .నిత్యం వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ఎంతో అవసరం.

Related Posts
పోసాని అరెస్ట్ అక్రమమన్న రోజా
పోసాని అరెస్ట్ అక్రమమన్న రోజా

వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు తెర వేసాయి. ఆమె మాట్లాడుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి Read more

వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ కీలక సూచనలు
ttd meeting

త్వరలో జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ పలు కీలక సూచనలు చేసింది. జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే Read more

‘నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే’ – జగన్ కు లోకేష్ హెచ్చరిక
1497422 lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ సీఎం జగన్, మంత్రి నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా Read more

బడ్జెట్ పై చంద్రబాబు భారీ అంచనాలు
modi and chandra babu

ఫిబ్రవరి అనగానే మధ్యతరగతి వేతన జీవులు అందరికీ గుర్తుకు వచ్చేది కేంద్ర బడ్జెట్. ఆ మాటకొస్తే వేతన జీవులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరిపైనా బడ్జెట్ ప్రభావం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *