చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

Japan: చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు 85 డాలర్లను (దాదాపు రూ.12,300) చొప్పున నష్ట పరిహారంగా అందచేయాలని షిఝువోకా జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు పూర్తి వివరాలు
మాజీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అయిన 89 ఏళ్ల ఇవావో హకమాటా 1968లో నలుగురు వ్యక్తుల హత్యకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాటాకు మరణశిక్ష విధించింది.

చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

అతి పెద్ద నష్టపరిహారం ప్రకటించిన కోర్టు
అయితే ఈ బట్టలను డీఎన్‌ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచారని బయటపడింది. దీంతో హకమాటా మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. తప్పుడు కేసులో మరణశిక్షను ఎదుర్కొని అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన తొలి వ్యక్తిగా హకమాటా జపాను చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు కోర్టు ప్రకటించిన నష్టపరిహారం అతి పెద్ద మొత్తమని, అయితే ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏదీ భర్తీ చేయలేదని హకమాటా తరఫు న్యాయవాది హిడెయో ఓగావా వర్ణించారు. 1961లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా రిటైర్‌ అయిన హకమాటాకు సెంట్రల్‌ జపాన్‌లోని షిఝువోకాలోని సోయాబీన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఉద్యోగం లభించింది. రెండేళ్ల తర్వాత ఆయన యజమాని, యజమాని భార్య, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో కత్తిపోట్లకు గురై మరణించారు. తన చేత పోలీసులే బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఇవావో హకమాటా వాదించాడు.

Related Posts
UttarPradesh:భర్త ను చంపి హోలీ వేడుకలు జరుపుకున్న ముస్కాన్
UttarPradesh:భర్త ను చంపి హోలీ వేడుకలు జరుపుకున్న ముస్కాన్

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి.భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన తర్వాత నిందితురాలు ముస్కాన్ రస్తోగి Read more

ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడి
Afghanistan

మంగళవారం అర్థరాత్రి, ఆఫ్ఘనిస్తాన్ పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్ జిల్లాలో పాకిస్తాన్ జరిపిన వరుస వైమానిక దాడులు తీవ్ర విషాదానికి దారితీయగలిగాయి. ఈ దాడులలో కనీసం 15 మంది Read more

భారతదేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ సంస్థను ఎందుకు స్థాపించలేదు?
public policy school

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ దేశం ప్రపంచస్థాయి పబ్లిక్ పాలసీ పాఠశాలలను స్థాపించలేకపోయింది. అమెరికా మరియు యూరోప్ దేశాలు జాన్ ఎఫ్. Read more

Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త
Hyderabad:పెట్రోల్ పోసి భార్యను హతమార్చిన భర్త

అనుమానం ఒక కుటుంబాన్ని నాశనంచేసింది.భార్యను కోల్పోయేంత పరాకాష్టకు ఓ భర్త చేరుకున్నాడు.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినా, చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *