हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు

Vanipushpa
100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు

అనంతపురం జిల్లా యాడికి మండలం, చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. తొలుత కూలీగా పని చేసిన పుల్లయ్య, స్థానికంగా పరిచయాలు పెంచుకుని చిట్టీల వ్యాపారంలోకి ప్రవేశించాడు. 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, రూ.5 లక్షల నుండి రూ.50 లక్షల వరకు చిట్టీలను నడిపేవాడు. చిట్టీలు పాడుకున్నవారికి డబ్బులు ఇవ్వకుండా, అధిక వడ్డీ ఆశచూపి వాటిని తిరిగి తన వద్దే ఉంచుకునేవాడు. దీంతో పాటు పెద్ద మొత్తంలో వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నాడు.

ఒకప్పుడు కూలీ – ఇప్పుడు కోటీశ్వరుడు
చిట్టీల వ్యాపారంతో కొన్నేళ్లలోనే భారీగా డబ్బు సంపాదించిన పుల్లయ్య, పెద్ద భవంతి కట్టాడు.
తన ఇంట్లో నగదు లెక్కించేందుకు ప్రత్యేకంగా 5 యంత్రాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా కొత్తగా చిట్టీలు వేయించేవాడు, తద్వారా తన మోసాన్ని మరింత విస్తరించాడు.

100 కోట్లకు పైగా చిట్టీల మోసం- పరారీలో నిందితుడు

పారిపోయిన పుల్లయ్య – వేలాది కుటుంబాలకు ఆర్థిక నష్టం
ఈ నెల 23 నుండి 26 వరకు చిట్టీ డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చిన పుల్లయ్య, 21వ తేదీనే తన కుటుంబంతో పరారయ్యాడు. అతని మొబైల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో, బాధితులు అతని ఇంటికి చేరుకున్నారు.
సుమారు 700 మంది బాధితులు బుధవారం మధ్యాహ్నం అతని ఇంటి వద్ద గుంపుగా చేరుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలు కన్నీరు మున్నీరయ్యారు.

ఇంకా ఫిర్యాదు నమోదు కాలేదు
సంజీవరెడ్డినగర్ (SR Nagar) పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, సాయంత్రం వరకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. చిట్టీల మోసం జరిగినట్లు స్పష్టత రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. మోసపోయిన బాధితులు, తమ కష్టార్జితమైన డబ్బు తిరిగి రావాలంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటున్నారు. చిట్టీల వ్యవస్థను నియంత్రించేలా ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్లయ్యను ఎంత త్వరగా అరెస్ట్ చేస్తే, బాధితులకు న్యాయం జరిగే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చిట్టీల వ్యాపారం పేరుతో జరుగుతున్న అక్రమాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. వేలాది మంది చిన్నచిన్న పొదుపులు చేసి ఇంత పెద్ద మోసానికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం

    రామ్ వంజీ సుతార్ మృతి.. కేసీఆర్ సంతాపం

    గర్భిణి మృతదేహంపై మూఢనమ్మకాల అమానుష ఘటన

    గర్భిణి మృతదేహంపై మూఢనమ్మకాల అమానుష ఘటన

    సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

    సంక్రాంతి పండుగకు తెలంగాణ–ఏపీ ప్రత్యేక రైళ్లు

    ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

    ట్రాఫిక్ ఆటంకం కలిగింగే బస్ స్టాపులు మార్పు: సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

    హైదరాబాద్‌లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం

    ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

    ప్రేమ వివాహం ఏడాదిలోనే విషాదం.. కట్న వేధింపులతో భార్య హత్య

    రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

    రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి

    325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

    325 పోలీస్ డ్రైవర్‌ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

    మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

    మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. 40 మంది క్యాడర్ లొంగుబాటు

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

    ఫోన్ ట్యాపింగ్ కేసు.. సజ్జనార్ పర్యవేక్షణలో సిట్‌

    సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

    సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

    తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

    తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

    📢 For Advertisement Booking: 98481 12870