हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ChandrababuNaidu :వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి : సీఎం చంద్రబాబు..

Anusha
ChandrababuNaidu :వాట్సప్ గవర్నెన్స్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి : సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది.ఇప్పటికే ప్రభుత్వ సేవల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన బాధ్యత ప్రజలపై ఉండేది. కానీ, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పుడు 161 రకాల సేవలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో వీటిని 500 సేవల వరకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.సెల్ ఫోన్ వినియోగదారులు ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీస్.. అనే విధంగా తమ పరిపాలన ఉండబోతోందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ప్రభుత్వ సేవలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాయిస్-ఎనేబుల్డ్ సేవలు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే 100 రోజుల్లో ఈ కొత్త సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి అసెంబ్లీ సమావేశాల నాటికి అవసరమైన సవరణలు పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఇకపై, సర్టిఫికెట్ల కోసం లేదా ఇతర సేవల కోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు.

టెక్నాలజీతో సమర్థ పాలన

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని స్వీకరించిన అనంతరం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం ద్వారా సమర్థమైన పాలన అందించనున్నట్లు హామీ ఇచ్చారు.“సెల్‌ఫోన్‌ ఒక వ్యసనంగా మారితే అనేక సమస్యలు వస్తాయి. అదే సెల్‌ఫోన్‌ను ఆయుధంగా మలుచుకుంటే అందరి జీవితాల్లో వెలుగు వస్తుంది,” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే తన లక్ష్యమని, ఇకపై ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్‌ఫోన్‌ ద్వారా అన్ని సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

Capture

వాట్సప్ ద్వారా ఎలాంటి సేవలు

ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న 161 రకాల సేవలలో:ఆదాయ, మీసేవా, జన్మ, మృతి సర్టిఫికెట్లు,విద్యా సంబంధిత ధృవీకరణ పత్రాలు,వ్యవసాయ, పింఛన్లు, రేషన్ కార్డు సేవలు,పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు,ఆరోగ్య, మెడికల్ సేవలు.ఇవన్నీ సెల్‌ఫోన్‌లోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రజలు వాట్సప్‌లో ప్రభుత్వ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా అవసరమైన సేవలు పొందవచ్చు.

పాలన వికేంద్రీకరణ

చంద్రబాబు మాట్లాడుతూ, “గతంలో ఎన్టీఆర్ మండలాలను తీసుకువచ్చారు. ఇప్పుడు మేము ప్రజల వద్దకు పాలనను తెచ్చాం. ఇకపై కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి సేవను డిజిటల్ రూపంలో ప్రజల చెంతకు తీసుకువస్తాం” అని అన్నారు.ఇప్పటికే ప్రజలు క్యాబ్‌లు, ఆటోలు బుక్ చేసుకోవడానికి, ఇంట్లో ఏసీని ఆన్/ఆఫ్ చేసేందుకు సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. అదే విధంగా, ప్రభుత్వ సేవలన్నీ కూడా ఇకపై సెల్‌ఫోన్‌లోనే అందించేందుకు చర్యలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.

వాట్సప్ గవర్నెన్స్‌

ప్రస్తుతం అమలులో ఉన్న వాట్సప్ గవర్నెన్స్‌ను మరింత విస్తరించి, ఇంకా ఎక్కువ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. వీటిని 500 సేవల వరకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది.ఇది రాష్ట్ర పాలనలో విప్లవాత్మక మార్పును తెస్తుందని, దీని ద్వారా ప్రజలకు సేవలందించే విధానం పూర్తిగా మారిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870