ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ప్రపంచ వ్యాప్తంగా భారత్ అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. బ్రెజిల్లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ప్రస్తుత అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోయాయని మోదీ స్పష్టంగా పేర్కొన్నారు. టైప్రైటర్పై ఆధునిక సాఫ్ట్వేర్ నడిపే ప్రయత్నం చేసినట్టు ఈ సంస్థలు పనిచేస్తున్నాయన్న ఆయన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల్లో ఆయుధం లేని విమర్శ కన్నా, పరిష్కారాల పట్ల మోదీ దృష్టి పడ్డట్టు కనిపించింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి కీలక వ్యవస్థలు మారడం లేదని ఆయన విమర్శించారు. “సిమ్ కార్డు ఉన్నా నెట్వర్క్ లేని ఫోన్లా” ఇవి ఉపయోగం లేని స్థితిలో ఉన్నాయని చురకలు వేశారు. గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే, ఈ సంస్థలు ప్రపంచ అవసరాలను నెరవేర్చలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు.

80 ఏళ్లుగా మారని వ్యవస్థలు
ఇటీవలి దశాబ్దాల్లో ఏఐ వంటి టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నా, భద్రతా మండలి, WTO, అభివృద్ధి బ్యాంకుల్లో మార్పు కనిపించలేదని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులు, అభివృద్ధి సహాయం వంటి అంశాల్లో గ్లోబల్ సౌత్కు హామీలే తప్ప సహాయం జరగడం లేదన్నారు.
బ్రిక్స్ విస్తరణ – మార్పు సంకేతం
బ్రిక్స్ కూటమిని విస్తరించడం ఒక కీలక ముందడుగు అని మోదీ పేర్కొన్నారు. ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా పనిచేయాలన్న సంకల్పానికి నిదర్శనమన్నారు. అంతర్జాతీయ వేదికల్లోనూ ఇలాంటి సంస్కరణలు అవసరమని, భారతదేశం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి తగిన అర్హత కలిగిన దేశంగా నిలుస్తోందని మోదీ వివరించారు.
బ్రెజిల్ మద్దతు – మోదీకి బలమైన మిత్రుడు
మోదీ వ్యాఖ్యలకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా పూర్ణ మద్దతు ప్రకటించగా, రెండు దేశాల సన్నిహితత మరోసారి స్పష్టమైంది. అంతర్జాతీయంగా భారత్కు ప్రాధాన్యం పెరుగుతున్న సంకేతాలు ఇది.
Read Also : Akash Deep : ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం