తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

Mobile Phones: తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి. టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) 2024 సెప్టెంబ‌ర్ నివేదిక ప్ర‌కారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగ‌దారుల సంఖ్య 4.19 కోట్లు. ఇందులో మొబైల్ ఫోన్ వినియోగ‌దారుల సంఖ్య 4.4 కోట్లు కాగా, ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల సంఖ్య‌15.25 లక్ష‌లుగా ఉంది.

తెలంగాణలో మొబైల్ ఫోన్ల విస్ఫోటనం – జనాభా కంటే అధికం!

గ్రామీణ ప్రాంతంలో 41 శాతం
ఇక టెలిఫోన్ వినియోగ‌దారుల్లో 60 శాతానికి పైగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉంటే.. 39 శాతానికి పైగా గ్రామీణంలో ఉన్నారు. కేవ‌లం మొబైల్ ఫోన్ల వినియోగ‌దారుల‌ను చూస్తే ప‌ట్ట‌ణాల్లో 59 శాతం మంది, గ్రామీణ ప్రాంతంలో 41 శాతం మంది ఉన్నారు. అలాగే ల్యాండ్‌లైన్ వినియోగ‌దారుల్లో 96 శాతం ప‌ట్ట‌ణాల్లో ఉంటే.. గ్రామీణంలో కేవ‌లం 4 శాతం మాత్ర‌మే. ట్రాయ్‌ నివేదిక ప్ర‌కారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్‌లెస్ టెలీ డెన్సిటీ 105.32 శాతంగా ఉంది. అంటే రాష్ట్రంలోని స‌గ‌టున ప్ర‌తి 100 మందికి 105కి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
దేశంలో నాలుగో స్థానంలో
ఈ అంశంలో రాష్ట్రం దేశంలో నాలుగో స్థానంలో ఉంది. గోవా-152, కేర‌ళ‌-115, హ‌ర్యానా 114 శాతంతో మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే తెలంగాణ‌లో ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల సంఖ్య 3.64కోట్లుగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు తెలంగాణ ప్రజలు కమ్యూనికేషన్,టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి. సమాచార సేకరణ, డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ విద్య వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్లు నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో మొబైల్ కనెక్టివిటీ ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యం.

Related Posts
శంషాబాద్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
A plane narrowly missed a major accident in Shamshabad! copy

హైదరాబాద్‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర విమానం ప్రమాదం తప్పింది. పైలట్‌ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. లేదంటే రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొని Read more

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Release of Indiramma Atmiya Bharosa funds

మొత్తం 18,180 మందికి 6 వేల చొప్పున జమ హైదరాబాద్: ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు Read more

Telanagana Budget: గ్యారంటీలకు నిధులు లేవు కేటీఆర్
KTR :తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన కేటీఆర్

బడ్జెట్ కేటాయింపులపై కేటీఆర్ అసంతృప్తి తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏ ఒక్క రంగానికీ Read more

తెలియని వ్యక్తులపై రంగు చల్లితే కఠిన చర్యలు -సీపీ
holi

హోలీ సందర్భంగా ప్రజలు మర్యాదపూర్వకంగా సంబరాలు జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. రోడ్డుపై వెళ్తున్న తెలియని వ్యక్తులపై రంగులు చల్లడం పూర్తిగా నిషేధించబడిందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *