లండన్ హీత్రూ విమానాశ్రయంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వందలాది విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యూరప్లోని అతిపెద్ద ప్రయాణ కేంద్రాల్లో ఒకటైన హీత్రూ, శుక్రవారం మొత్తం మూసివేయబడింది.
విమాన రాకపోకలపై ప్రభావం
అనేక విమానాలు గాట్విక్, పారిస్ చార్లెస్ డి గాల్లె, ఐర్లాండ్లోని షానన్ విమానాశ్రయాలకు మళ్లించారు.
1,350కి పైగా విమానాలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా అమెరికా నగరాలకు వెళ్లే అనేక విమానాలను రద్దు చేశారు. యునైటెడ్ ఎయిర్లైన్స్, డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి కంపెనీలు తమ విమానాలను రద్దు చేశాయి.

హీత్రూ అధికారుల ప్రకటన
“ప్రయాణీకుల భద్రత కోసం హీత్రూను మూసివేయడం తప్ప వేరే మార్గం లేదు” అని విమానాశ్రయం తెలిపింది. విమానాశ్రయం తిరిగి తెరుచుకునే వరకు ప్రయాణికులు హీత్రూ వైపు రాకూడదని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో కూడా గణనీయమైన అంతరాయం కొనసాగుతుందని హెచ్చరించారు. హీత్రూ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. 2024 జనవరిలో 6.3 మిలియన్ల మంది ప్రయాణించారు, గతేడాది ఇదే నెలతో పోలిస్తే 5% పెరిగింది. రోజుకు సగటున 200,000 మందికి పైగా ప్రయాణికులు హీత్రూను ఉపయోగిస్తున్నారు.
విద్యుత్ అంతరాయం – అగ్నిప్రమాదం కారణాలు
పశ్చిమ లండన్లోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగాయి.
10 అగ్నిమాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది మంటలను దాదాపు 150 మందిని ఖాళీ చేయించారు.
మంటల కారణంగా పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి, ప్రజలను ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు.
విమానాశ్రయం పునరుద్ధరణపై అప్రమత్తత
విద్యుత్ ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనేదానిపై అధికారిక సమాచారం ఇంకా అందలేదు. హీత్రూ తీవ్రంగా ప్రభావితమైందని, రైలు ప్రయాణాలు కూడా నిలిపివేశారని నేషనల్ రైల్ ప్రకటించింది.
విమానాశ్రయం శుక్రవారం రాత్రి 11:59 వరకు మూసివుండే అవకాశముంది.