ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడే కాలం పోయింది.ఇప్పుడు వీడియో కాల్స్, మెసేజింగ్ అప్లికేషన్ల హంగామా.ఇందులో స్కైప్కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇప్పుడు ఈ సేవ ఆగిపోనుంది.దాదాపు 20 ఏళ్లుగా సేవలందించిన స్కైప్ ఇక ఉండదు.మైక్రోసాఫ్ట్ సంస్థ మే 5తో ఈ అప్లికేషన్ను పూర్తిగా నిలిపివేస్తోంది.ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయి.కరోనా సమయంలో స్కైప్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఉద్యోగాలు, మిట్ంగ్స్ అన్నీ ఆన్లైన్కి మారాయి.స్కైప్ ఎంతో మందికి ఆ వేదికగా నిలిచింది.కానీ కరోనా తర్వాత పరిస్థితి మారింది.జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ లాంటి ఆప్స్ బాగా పాపులర్ అయ్యాయి.

ఇవి స్కైప్కి గట్టి పోటిగా మారాయి.దీంతో స్కైప్ వినియోగదారులు తగ్గిపోతున్నారు. మైక్రోసాఫ్ట్ తమ కమ్యూనికేషన్ సేవలను ఏకీకృతం చేస్తోంది. దీంతో స్కైప్ను నిలిపివేయాలని నిర్ణయించింది.ఇక మీదట స్కైప్ను మైక్రోసాఫ్ట్ టీమ్స్ భర్తీ చేయనుంది. టీమ్స్లో అన్ని సేవలు పొందగలుగుతారు. వీడియో కాల్స్, చాటింగ్కి ఇది ప్రధాన వేదికగా మారుతుంది.మైక్రోసాఫ్ట్ ఇప్పటికే యూజర్లను టీమ్స్ వైపు మళ్లిస్తోంది. చాలా మంది ఇప్పటికే మారిపోయారు కూడా.స్కైప్కి బదులుగా టీమ్స్ మరింత ఆధునికంగా ఉంటుందని చెబుతున్నారు.ఇంకా మారని యూజర్లకు మైక్రోసాఫ్ట్ సమయం ఇచ్చింది. చాట్ హిస్టరీలు, కాంటాక్ట్లను టీమ్స్కు బదిలీ చేయవచ్చు. ఈ మార్పు అనుకూలంగా ఉండేలా చొరవ తీసుకుంటోంది.ఒక్కసారి చూస్తే, ఇది యూజర్ల కోసం మంచిదే అనిపించొచ్చు. ఎందుకంటే టీమ్స్ ఫీచర్లు స్కైప్ కన్నా మెరుగ్గా ఉన్నాయి. అంతేగాక, ఇది ఆఫీస్ 365లో భాగంగా లభిస్తోంది.వాతావరణ మారితే పాత టూల్స్కి వీడ్కోలు చెప్పాల్సిందే. స్కైప్కి అది వచ్చేసింది. కానీ కొత్తదానికి ఓ సవాగతం పలకడంలో తప్పేంటి?
Read Also : Zomato : జొమాటో లో ‘క్విక్’ ఫుడ్ డెలివరీ సేవ నిలిపివేత