అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

America: అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ అమలు చేస్తున్న ఇమిగ్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది వలసదారులు సోమవారం డాలస్‌లో ప్రదర్శన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇమిగ్రేషన్‌ అధికారులు నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. వీరంతా దేశభక్తి, ఐకమత్యాలను చాటుకునేందుకు అమెరికా జెండాలని పట్టుకుని నినాదాలు చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇటీవల ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ విశ్వవిద్యాలయాల నుంచి అరెస్టయిన వారిని గుర్తు తెచ్చే బ్యానర్లను కూడా పట్టుకున్నారు.

Advertisements
అమెరికాలో విద్యార్థులను విడుదల చేయాలని భారీ ప్రదర్శన

మూడోసారి అధికారం అంత సులభం కాదు!
రాజ్యాంగం అనుమతించక పోయినా డొనాల్డ్‌ ట్రంప్‌ మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టించి, తర్వాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మీకు బదిలీ చేస్తారా? అన్న ఒక ప్రశ్నకు అదీ ఒక పద్ధతని ట్రంప్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే మూడోసారి అధ్యక్షుడు కావడం అంత సులభం కాదని.. అమెరికా అధ్యక్షుని ఎన్నికపై ఉన్న రెండు దఫాల నిబంధనను మార్చాలంటే రాజ్యాంగ సవరణతో పాటు మెజారిటీ రాష్ర్టాల ఆమోదం అవసరం అని నిపుణులు చెప్తున్నారు.
అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ హడలగొడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆ సుంకాల అమలుకు పెట్టిన డెడ్‌లైన్‌ ఏప్రిల్‌ 2వ తేదీ గడువు సమీపిస్తున్న వేళ మరో పిడుగులాంటి హెచ్చరిక చేశారు. సుంకాల విధింపు కొన్ని దేశాలకే పరిమితం కాదని, తమతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాణిజ్య సంబంధాలు జరుపుతున్న దేశాలన్నింటికీ ఈ టారిఫ్‌లు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అర్కిటిక్‌ ద్వీపం దక్కదని గ్రీన్‌లాండ్‌ కొత్త ప్రధాని నీల్సన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ట్రంప్‌ ప్రకటనపై ఆయన స్పందిస్తూ ‘మేం మరెవరీకి చెందిన వారం కాదు.

Related Posts
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 56 సంవత్సరాల తరువాత గయానాను సందర్శించారు
modi guyana

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం గయానాను సందర్శించి, 56 సంవత్సరాల తరువాత గయానా వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. ఆయన గయానా రాజధాని Read more

బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్

జాన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సోమవారం మాట్లాడారు. తాను ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అయితే బెయిల్ ఉత్తర్వులపై సంతకం చేయాలని వచ్చినప్పుడు నిరాకరించానని Read more

మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్
Sunita Williams to land in

అనివార్య సాంకేతిక సమస్యల కారణంగా 8 నెలలుగా అక్కడే భారత సంతతికి చెందిన NASA ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమి మీదకు తిరిగి రానున్నారు. Read more

Myanmar: మయన్మార్‌లో భారీ భూకంపం: ప్రజలు రోడ్లపైకి పరుగులు
మయన్మార్‌లో భారీ భూకంపం: ప్రజలు రోడ్లపైకి పరుగులు

భూకంపం తీవ్రత 7.2మయన్మార్‌లో ఈ రోజు సంభవించిన భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతను నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటన ప్రకారం, ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×