Major road accident.. Handriniva Deputy Collector dies

Annamaya District : ఘోర రోడ్డు ప్రమాదం.. హంద్రీనీవా డిప్యూటీ కలెక్టర్‌ మృతి

Annamaya District : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి మధ్య రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి (50) మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisements
ఘోర రోడ్డు ప్రమాదం హంద్రీనీవా

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం

కాగా, క్షతగాత్రులను రాయచోటి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బాధితులను జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పరామర్శించారు. మృతిచెందిన డిప్యూటీ కలెక్టర్‌ రమ.. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. పీలేరు నుంచి రాయచోటిలోని కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి రమ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Related Posts
United States: నిధుల సంక్షోభం కారణంగా మయన్మార్‌లో ఆహార సహాయం తగ్గింపు
నిధుల సంక్షోభం కారణంగా మయన్మార్‌లో ఆహార సహాయం తగ్గింపు

ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మయన్మార్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలకు ఆహార సహాయం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శుక్రవారం ప్రకటించింది. నిధుల కొరత "క్లిష్టమైన" Read more

షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

కెన్యా అధ్యక్షుడు అదానీతో ఒప్పందాలు రద్దు..
Adani

2024 నవంబర్ 21న కెన్యా అధ్యక్షుడు ఒక కీలక ప్రకటన చేశారు. ఆయన, భారతీయ పరిశ్రమ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో కలిసిన కొన్ని భారీ ఒప్పందాలను Read more

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్
Rahul Gandhi reached Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×