Aarogyasri medical services to be closed in AP from today.

Aarogyasri : ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు బంద్..!

Aarogyasri : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ఈరోజు నుండి బంద్ అయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు బంద్ కానున్నాయి అంటూ.. ఆరోగ్యశ్రీ కింద పని చేస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటన చేశాయి. దాదాపు 3500 కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisements
ఏపీలో నేటి నుండి ఆరోగ్యశ్రీ వైద్య

రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు బంద్‌

తమ బిల్లులు వచ్చేవరకు ఆరోగ్యశ్రీ సేవలు.. బందు చేస్తున్నట్లు ప్రకటన చేశాయి. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే ఏపీలో కొనసాగులున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 600 ఆసుపత్రులలో ఓపిలతో పాటు అన్ని వైద్య సేవలు కూడా ఆగిపోయాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం సుమారు 2500 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెట్టిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌

కాగా, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం.

Read Also: నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

Related Posts
కాంగ్రెస్‌కు రంజాన్ గిఫ్టు ఇదే – బండి సంజయ్
bandi sanjay revant

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు కీలక స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ Read more

India: మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్
మైనారిటీల హక్కులపై బంగ్లాదేశ్​ను హెచ్చరించిన భారత్

పశ్చిమ బెంగాల్​ హింసపై బంగ్లాదేశ్ అధికారులు చేసిన వ్యాఖ్యలను భారత్ గట్టిగా​ తిప్పికొట్టింది. భారత్​కు ధర్మోపదేశాలు చేసే బదులు, బంగ్లాదేశ్​లో ఉన్న మైనారిటీల హక్కులను పరిరక్షించడంపై దృష్టి Read more

Stalin: త్వరలో 39మంది ఎంపీలతో ప్రధాని మోడీని కలుస్తాం: స్టాలిన్
Will meet PM Modi soon with 39 MPs.. Stalin

Stalin: కేంద్రం యొక్క పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకించడానికి ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ఒక వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించినట్లు తమిళనాడు Read more

వెంకటపాలెంలో అట్టహాసంగా శ్రీనివాస కల్యాణం
srinivasa kalyanam in venka

ఏపీ రాజధాని అమరావతికి సమీపంలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల ఉత్సాహంతో ఆలయ ప్రాంగణం భక్తిరసంతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×