ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (Premier League 2025) సీజన్లో ప్లేఆఫ్స్ రేసులో లేకపోయినా, లక్నో సూపర్జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఒక అద్భుత విజయాన్ని అందుకుంది.గుజరాత్ టైటాన్స్ (జీటీ)పై 33 పరుగుల (33 runs against Gujarat Titans (GT)) తేడాతో గెలుపొందుతూ అందరిని ఆశ్చర్యపరిచింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోకు మిచెల్ మార్ష్ మెరుపు శతకంతో భారీ స్కోరు( Mitchell Marsh hits a blistering century for Lucknow) అందించాడు.64 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.అతడికి ఆదిలో మార్క్రమ్ (36) తోడవగా, ఆ తర్వాత నికోలస్ పూరన్ (56 నాటౌట్) బ్యాటింగ్లో వేగాన్ని రెట్టింపు చేశాడు.(IPL 2025)

బ్యాటింగ్లో దూకుడుగా లక్నో
మార్ష్ అర్ధశతకం కేవలం 33 బంతుల్లో పూర్తి చేశాడు.56 బంతుల్లో శతకం సాధించాడు.రషీద్ ఖాన్ ఓ ఓవర్లోనే మార్ష్ 24 పరుగులు తీయడం గమనార్హం.పూరన్ కూడా 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.చివర్లో పంత్ కూడా 16 పరుగులు చేసి స్కోరును 235కి చేర్చాడు.
గుజరాత్ జవాబు – ఆరంభంలోనే తడబాటు
236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్,వేగంగా ఆరంభించినా మధ్యలో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది.సుదర్శన్ (21) త్వరగా వెనుదిరిగాడు.గిల్ (35) – బట్లర్ (33) చిన్న భాగస్వామ్యం నెలకొల్పినా,ఇద్దరూ వెంట వెంటనే ఔటయ్యారు.
షారుఖ్ – రూథర్ఫర్డ్ పోరాటం
రూథర్ఫర్డ్ (38)–షారుఖ్ ఖాన్ (57) జట్టుకు ఆశలు నూరిపోశారు.అయితే,చివరి నాలుగు ఓవర్లలో 54 పరుగులు అవసరమైన సమయంలో రూథర్ఫర్డ్ – తెవాటియా ఔటయ్యారు.షారుఖ్ కూడా నిలవలేకపోయాడు.
లక్నో బౌలింగ్ హైలైట్
ఒరూర్క్ 3 వికెట్లు తీసి గేమ్ను మార్చాడు.ఆయుష్ బదోని చివరి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు.ఆవేష్ ఖాన్ కూడా 2 వికెట్లు తీశాడు.బౌలర్ల సమిష్టి ప్రదర్శన విజయంలో కీలకమైంది.మిచెల్ మార్ష్ శతకం బాదుతూ ఐపీఎల్లో సెంచరీ చేసిన తన సోదరుడు షాన్ మార్ష్ సరసన నిలిచాడు.ఐపీఎల్ చరిత్రలో సెంచరీలతో గుర్తింపు పొందిన తొలి సోదరులు గా మార్ష్ బ్రదర్స్ నిలిచారు.
గుజరాత్ ఆశలు నిలిచినప్పటికీ షాక్
ఈ ఓటమితో గుజరాత్కు ఇది నాలుగో పరాజయం.అయినా, వారు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.లక్నో మాత్రం ఈ విజయంతో గర్వపడేలా సీజన్ ముగించింది.
Read Also : IPL 2025: ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా