हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Mahanadu : రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు – నారా లోకేష్

Sudheer
Mahanadu : రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్లకు నిద్ర పట్టడం లేదు – నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) సభలో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కీలక ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని విధ్వంస పాలన నుంచి గట్టెక్కించిన ఘనత టీడీపీ కూటమిదే అంటూ ధీమాగా తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణం నుంచి అప్పులప్రదేశ్ గా మారిందని విమర్శించారు. రెడ్ బుక్ పేరును కూడా వైసీపీ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కార్యకర్తే అధినేత అంటూ, పార్టీని కార్యకర్తల నడకదారిలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కూటమి విజయానికి గల ప్రధాన కారణాలు

లోకేష్ ప్రకారం, టీడీపీకి అధికారంలోకి రావడం కొత్త విషయం కాదు. కానీ 2019 నుంచి 2024 వరకూ ప్రజల బాధలు, కేసులు, అరెస్టులు చూసిన తరవాత ప్రజలు తామే పాలనకు సమర్థులమని మరోసారి నమ్మకాన్ని ఇచ్చారని చెప్పారు. మోదీ, పవన్, చంద్రబాబు జెండాలు పక్కన పెట్టి ప్రజల కోసం కలిసి పనిచేశారని, అది కూటమి విజయానికి ప్రధాన కారణమని వివరించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 164/175 సీట్లు సాధించడం కేవలం గెలుపు కాదు, అది ఆల్ టైం రికార్డు అని గర్వంగా తెలిపారు.

పూర్తిస్థాయిలో పాలన – సమస్యల పరిష్కారానికి లోకేష్ హామీ

లోకేష్ మాట్లాడుతూ, ఇకపై ప్రతి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలన్నారు. సాధ్యమవకపోతే వారి దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. నామినేటెడ్ పదవులు ఒకే విధంగా ఇస్తామని, పనిచేసేవారికి మాత్రమే ప్రోత్సాహం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇక 16,347 పోస్టులతో మెగా DSC, ఉచిత మహిళా బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్టు తెలిపారు. చివరగా, తప్పులు చేసిన వారిని శిక్షించడం ఖాయం, ఎవరూ తప్పించుకోలేరు అంటూ హెచ్చరించారు. ఈ ప్రసంగం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Read Also : Chandrababu Naidu : రాష్ట్రం నుంచి తరిమికొడదాం : చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870