हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

బడ్జెట్ పై లోకేశ్ ప్రశంస

Anusha
బడ్జెట్ పై లోకేశ్ ప్రశంస

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3.22 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తాజా బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని, ముఖ్యంగా విద్యా రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉచిత విద్యుత్

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించే నిర్ణయాన్ని మంత్రి విప్లవాత్మకంగా అభివర్ణించారు. ఇది స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే విధంగా ఉంటుందని అన్నారు. ఈ నిర్ణయం విద్యారంగ అభివృద్ధికి దోహదపడుతుందని, దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుని మరింత మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు ప్రయోజనం

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రకటించిన “తల్లికి వందనం” పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయడానికి బడ్జెట్‌లో రూ. 9,407 కోట్లు కేటాయించినట్లు నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలోని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తించనుంది.ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఇది తల్లిదండ్రుల భారం తగ్గించడంతో పాటు విద్యను ప్రోత్సహించే విధంగా పనిచేస్తుందని మంత్రి వివరించారు.

cr 20250118tn678b4f6b5dc0c

విద్యకు కేటాయింపులు

ఈసారి బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 2,506 కోట్లు కలిపి మొత్తం రూ. 34,311 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 2,076 కోట్లు ఎక్కువ అని లోకేశ్ తెలిపారు. ఈ భారీ కేటాయింపులు ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన నిర్ణయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

రానున్న ఐదేళ్లలో ఏపీ మోడల్ విద్యావ్యవస్థను అమలు చేయాలనే త‌న సంకల్పానికి ఈ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు దన్నుగా నిలుస్తాయని లోకేశ్ అన్నారు. ప్రత్యేకంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు.ఈ హబ్ ద్వారా ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునే మార్గం ఏర్పడుతుందని, రాష్ట్రంలోని టెక్నాలజీ, ఆవిష్కరణలకు ఊతమిస్తుందని నారా లోకేశ్ తెలిపారు. ఇది ముఖ్యంగా ఐటీ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు, స్టార్టప్ కల్చర్‌ను ప్రోత్సహించేందుకు దోహదం చేయబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బడ్జెట్ 2025-26లో విద్య, ఐటీ, సంక్షేమ రంగాలకు భారీ కేటాయింపులు చేయడం ప్రభుత్వం యొక్క ప్రజాసంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. “ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870