రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ జలాల్లో ఒక శత్రు దేశ యుద్ధనౌకను అమెరికా టార్పెడోతో ముంచివేయడం ఇదే మొదటిసారి. ఈ ఘటనతో అగ్రరాజ్యం అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా(America) యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ధృవీకరించిన ప్రకారం, అమెరికాకు చెందిన ‘ఫాస్ట్ అటాక్’ జలాంతర్గామి ఒక్క మార్క్ 48 (Mark 48) టార్పెడోను ఉపయోగించి ఇరాన్ యుద్ధనౌక IRIS దేనాను సముద్రపు అడుగుభాగానికి పంపింది. 1945 తర్వాత ఒక శత్రు పోరాట నౌకను అమెరికా నేరుగా అటాక్ చేసి ముంచేయడం ఇదే తొలిసారి కావడంతో దీనిని “నిశ్శబ్ద మరణం” (Silent Death) గా అభివర్ణించారు.
Read Also: Iran USWar 1145 Deaths: ఇరాన్లో మృత్యుఘోష..1145కి చేరిన మృతుల సంఖ్య

అమెరికా ప్రపంచ సైనిక శక్తి ప్రదర్శన
అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కెయిన్ ఈ దాడిని సమర్థించారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న శత్రువునైనా వేటాడి, కనుగొని, మట్టుబెట్టగల సామర్థ్యం తమకు ఉందని ఈ ఆపరేషన్ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తీరానికి 2,000 మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, అమెరికా తన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. తమ యుద్ధనౌక మునిగిపోవడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికా చేసిన ఈ “సముద్ర దారుణానికి” పశ్చాత్తాపం తప్పదని హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) “యా హసన్ ఇబ్న్ అలీ” అనే కోడ్ పేరుతో భారీ ఎదురుదాడిని ప్రారంభించింది. అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన 7 కంటే ఎక్కువ అధునాతన రాడార్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. డిమోనాపై కన్నేసిన ఇరాన్: తమ దేశ ఉనికికి భంగం కలిగితే ఇజ్రాయెల్లోని అత్యంత కీలకమైన డిమోనా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: