
T20 World Cup 2026: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్ ఒక అరుదైన దృశ్యానికి వేదికైంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఇద్దరు మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ఒకే చోట కనిపించి సందడి చేశారు. భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపిస్తుంటే, డ్రెస్సింగ్ రూమ్ నుండి ఆ ఆటను వీక్షిస్తూ వీరిద్దరూ ఆనందించారు.
Read Also: IND 253 runs : ఇంగ్లాండ్కు భారీ లక్ష్యం, పరుగుల తుఫాన్తో భారత్ 253
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు ప్రపంచ విజేతలు
భారత క్రికెట్కు టీ20 ప్రపంచ కప్లు అందించిన ఘనత వీరిద్దరి సొంతం. ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2007లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ను ముద్దాడగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2024లో భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు 2026 సెమీఫైనల్ సందర్భంగా ఈ ఇద్దరు దిగ్గజాలు ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించడం అభిమానులకు కనువిందు కలిగించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: